
బ్రాహ్మణ సంఘం అధికార ప్రతినిధిగా బాలాజీ శర్మ
నగరి: తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి అధికార ప్రతినిధిగా పుత్తూరుకు చెందిన బాలాజీ శర్మ నియమితులయ్యారు. సోమవారం బ్రాహ్మణ సంఘ ఆవిర్భావ దినోత్సవం శ్రీకాళహస్తి బ్రాహ్మణ భవనంలో వేడుకగా జరిగింది. చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తాటితోపు తదితర బ్రాహ్మణ సంఘాలు అన్నిటిని కలుపుతూ బ్రాహ్మణులంతా ఐక్యంగా ఒక తాటి మీదకు రావాలనే సంకల్పంతో రాష్ట్ర యువజన అధ్యక్షుడు, తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీవేదం హరిప్రసాద్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధికార ప్రతినిధిగా బాలాజీ శర్మ, సంయుక్త కార్యదర్శిగా బాలాజీ రావు, మహిళా విభాగం నుంచి టీకే లలిత, కలంచేరీ గీతలను నియమించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు, క్రమశిక్షణ మండలి అధ్యక్షుడు కొత్తపల్లి అజయ్కుమార్, శ్రీకాళహస్తి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ప్రకాశం, పుత్తూరు బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు ఆలూరు రామకృష్ణ నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
286 కిలోల
ఎర్రచందనం స్వాధీనం
రేణిగుంట: కడప వైపు నుంచి రేణిగుంట వైపు వస్తున్న వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు అనుమానంతో ఆపగా వాహనాన్ని వదిలి డ్రైవర్ పరారయ్యాడు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 286 కిలోల బరువు గల తొమ్మిది ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. వివరాలు.. తిరుపతి అటవీ క్షేత్రాధికారి బీ.సుదర్శన్రెడ్డికి అందిన రహస్య సమాచారం మేరకు టీఎన్.పాలెం సెక్షన్ సిబ్బందితో కలిసి ఆదివారం రాత్రి 11.30 గంటలకు కడప నుంచి రేణిగుంట రోడ్ వరకు పెట్రోలింగ్ చేయగా.. రాత్రి 11.45 గంటలకు ఒక వాహనం అతివేగంగా రావ డం గమనించారు. అటవీ అధికారులు శ్రీ నివాసపురం వద్ద ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవరు వాహనంలో నుంచి దూకి పరారయ్యాడు. ఈ దాడుల్లో ఎఫ్ఎస్ఓ చైతన్య, ఎఫ్బీఓ కే.వెంకటేశ్వరరావు, ప్రొటెక్షన్ వాచర్లు సిసింద్రీ, వెంకటేష్, ప్రసాద్, నవీన్, రవి పాల్గొన్నారు.