
వైఎస్సార్సీపీలో చేరికలు
కోట: కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్ సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆరోపించారు. ఆయన సోమవారం విద్యానగర్లోని నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళాభవన్లో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై బుధవారం గూడూరులో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
పార్టీలో చేరిన పలువురు యువకులు
చిట్టమూరు మండలం, ఎల్లూరుకు చెందిన 20 మంది యువకులు, కోటకు చెందిన పలువురు యువకులు మేరిగ మురళీధర్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయన పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. గూడూరు నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటు ఉంటానని హామీ ఇచ్చారు. కోట, చిట్టమూరు మండలాల కన్వీనర్లు పలగాటి సంపత్కుమార్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఎంపీపీ అంజమ్మ, జెడ్పీటీసీ కోటయ్య, నాయకులు భక్తవత్సల్రెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి, ప్రసాద్గౌడ్, నాగూర్రెడ్డి, రాఘవరెడ్డి, రాజశేఖర్రెడ్డి, సుధాకర్ నాయుడు, ఎన్వీ రమణయ్య, కస్తూరిరెడ్డి, షనీల్రెడ్డి, రాజారెడ్డి, కోటేశ్వరరెడ్డి, పి.సురేంద్ర పాల్గొన్నారు.