
భార్యపై కక్ష పెంచుకుని హత్య
నాయుడుపేట టౌన్: భార్యపై కక్షతోనే భర్త రాయితో కొట్టి గొంతు నూలిమి హత్య చేసినట్లు సీఐ బాబి వెల్లడించారు. హత్య కేసులో నిందితుడైన మానికల శ్రీనివాసులును శుక్రవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిందితుడిని హాజరుపరిచి సీఐ వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని మడపలం గ్రామ సమీపంలో కాలువ గట్టు వద్ద శ్రీనివాసులు, భార్య వీణమ్మ(28), ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారని తెలిపారు. భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు భార్య అనుమానంతో నిత్యం వేధించేది. దీంతో శ్రీనివాసులు భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీ రాత్రి భార్య, భర్తలిద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో వీరి మధ్య వివాదం రేగింది. శ్రీనివాసులు ఇదే అదనుగా అక్కడే ఉన్న రాయితో భార్యపై దాడి చేసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీఐతో పాటు ఎస్ఐ ఆదిలక్ష్మి, పోలీసులు అన్ను దయాకర్, పోలయ్య, వెంకీలను డీఎస్పీ చెంచుబాబు అభినందించినట్లు తెలిపారు.