భక్తుల భద్రతకు భరోసా | - | Sakshi
Sakshi News home page

భక్తుల భద్రతకు భరోసా

Jun 4 2025 12:47 AM | Updated on Jun 4 2025 12:47 AM

భక్తు

భక్తుల భద్రతకు భరోసా

శ్రీవారి భక్తుల భద్రతే లక్ష్యంగా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. విష్ణునివాసం, శ్రీనివాసం వద్ద నిఘా పెట్టారు.

చదును చేసి.. చెరువు కబ్జా!

కలువాయి మండలం మాదన్నగారిపల్లెలో చెరువు పోరంబోకు భూమిని టీడీపీ స్థానిక నేత ఆక్రమించాడు.

బుధవారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2025

8లో

అవినీతికి ఆయనే ఆదర్శం.. మోసానికి మరోరూపం.. కుట్రలు.. కుతంత్రాలే ఆయన నైజం.. నయవంచనకు నిలువెత్తు నిదర్శనం.. వెన్నుపోటు అంటే ఆయనకే పేటెంటు.. సదరు ఘనత వహించిన బాబుగారు ఏళ్ల తరబడి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏనాడూ ఇచ్చిన మాట చెల్లించరు.. ఓట్ల కోసం అలవి కాని హామీలను సైతం సునాయాసంగా గుప్పించేస్తారు. ఆకాశం నేలమీదకు దించేస్తానంటారు.. సంపదను సృష్టించి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తానంటారు.. ఎలాగైనా పీఠం ఎక్కడమే పరమావధిగా భావిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను బుట్టదాఖలు చేసేస్తారు.. ఇదే తంతును చంద్రబాబు మరోసారి కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆశువుగా వల్లించిన సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రజలను బురిడీ కొట్టించారు. సూపర్‌ సిక్స్‌ అంటూ ఆర్భాటంగా తీసుకువచ్చిన మేనిఫెస్టోను మూలన పడేశారు. అభివృద్ధి సంగతి దేముడెరుగు.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు.. రోజుకో మాట చెబుతూ జనాలకు కుచ్చుటోపీ పెట్టేశారు. తత్వం బోధపడడంతో క్షేత్రస్థాయిలో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. బాబు మాటలు నమ్మి మోసపోయామంటూ మధనపడుతున్నారు. కూటమి సర్కారు తీరుకు నిరసనగా బుధవారం వెన్నుపోటు దినం పాటించాలని నిర్ణయించుకున్నారు. వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు పోటెత్తాలని పిలుపునిస్తున్నారు.

అస్తవ్యస్తంగా ఉంది

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచింది. పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. సంక్షేమం, అభివృద్ధి రెండు స్తంభించిపోయాయి. కనీసం పేద, బడుగు బలహీన వర్గాలకు ఒక్క పథకం కూడా అందలేదు. పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు ఆర్బాటంగా సూపర్‌సిక్స్‌తో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తామన్నారు. ఏడాది గడిచింది ఒక రూపాయి రాలేదు. గతంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు – మోహన్‌, మాజీ సర్పంచ్‌,

కురింజలం, వరదయ్యపాళెం

ఒక్క పథకం అందలేదు

గత ప్రభుత్వమే ఎంతో మేలుగా ఉంది. కూటమి సర్కార్‌ మా లాంటి పేదలకు ఏమి చేయలేదు. సంవత్సరం అయిపోయింది. ఇంక ఏం చేస్తారో నమ్మకం లేదు. గతంలో జగనన్న ఏడాదిలో ప్రతి నెలా ఏదో ఒక పథకంతో బ్యాంకు ఖాతాలో డబ్బు జమచేశారు. సొంత ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ ఉండడం లేదు. రెక్కల కష్టమే మిగులుతోంది. పిల్లల చదువులు కష్టంగా మారాయి. ఎన్నికల సమయంలో తల్లికి వందనం, కుటుంబంలో ఉన్న మహిళల అందరికి నెలకు రూ.1500 అన్నారు. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు.

– వెంకటరత్నమ్మ, అడుసుపాళెం, రేణిగుంట

ఉద్యోగాలు లేవు

యువగళం పాదయాత్రలో లోకేష్‌ బాబు యువతతో మీటింగ్‌ పెట్టి ఏడాదికి 4లక్షల ఉద్యోగాలు ఇస్తాం. 5ఏళ్లలో 20లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటాం అంటూ ఊదరగొట్టారు. ఇప్పటికీ ఆ ఊసేలేదు. ఉద్యోగం వచ్చేవరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. అదీ అమలు చేయలేదు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి రోడ్డుపాలు చేస్తున్నారు. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసిన ఏడాదికి తూతూమంత్రంగా భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. – రామకృష్ణ, ఎమ్మెస్సీ,

పీహెచ్‌డీ, తిరుపతి రూరల్‌

దారుణంగా ఉంది

ఏడాదిగా ఒక్క రూపాయి పేదలకు అందలేదు. ఎన్నికలలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ మహిళలకు చేరలేదు. గ్రామీణ ప్రాంతంలోని మాలాంటి పేదల పరిస్థితి దారుణంగా ఉంది. జగనన్న పాలనలో ఆసరా పథకం, సున్నావడ్డీ, అమ్మ ఒడితో ఎంతో మంది ఆర్థికంగా బలపడ్డారు. ఈ ఏడాది నుంచి పథకాలు రాక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా తల్లికివందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు పథకాలను అమలు చేసి ఆదుకోవాలి.

– టి.రేణుక, గృహిణి, సూళ్లూరుపేట

సంజయ్‌మూర్తికి సాదర వీడ్కోలు

రేణిగుంట : జిల్లా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన కంప్ట్రోలర్‌, ఆడిట్‌ జనరల్‌ సంజయ్‌మూర్తికి మంగళవారం రేణిగుంట విమానాశ్రయంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ సాదరంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రతిమను బహూకరించారు.

నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ

తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న లాసెట్‌ ప్రవేశ పరీక్ష గురువారం జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. తిరుపతి కేంద్రంగా జరగనున్న ఎస్వీసీఈ, శ్రీరామ, అన్నమాచార్య, చదలవడ రమణమ్మ ఇంజినీరింగ్‌ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు లాసెట్‌ చైర్మన్‌, వీసీ ప్రొఫెసర్‌ ఉమ తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్లతో పాటు ఐడీ ప్రూఫ్‌ను వెంట తీసుకురావాలని సూచించారు. పరీక్ష 9 గంటల నుంచి 10.30 వరకు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని తెలిపారు.

8న చెస్‌ టోర్నమెంట్‌

తిరుపతి కల్చరల్‌ : తిరుపతి యశోదనగర్‌లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 8వ తేదీన చెస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున, చెస్‌ సంఘం సీఈఓ బాలాజీ ప్రసాద్‌ తెలిపారు. మంగళవారం ఈ మేరకు టోర్నీ బ్రోచర్‌ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చెస్‌ పోటీలు జరుగుతాయన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఆసక్తిగల క్రీడాకారులందరూ టోర్నీలో పాల్గొనవచ్చని వెల్లడించారు. విజేతలకు ఆకర్షణీయమైన ట్రోఫీలు అందించనున్నట్లు చెప్పారు. పాల్గొన్న క్రీడాకారులందరికీ మెడల్స్‌, సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. మధ్యాహ్న భోజన వసతి ఉంటుందని తెలిపారు. క్రీడాకారులు ఎంట్రీ ఫీజు కింద రూ.200లు చెల్లించాలని సూచించారు. ఈ మేరకు పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 8555921134,8985080370 నంబర్లలో సంప్రదించాలని వెల్లడించారు.కార్యక్రమంలో నిర్వాహక ప్రతినిధులు ఎస్‌.రెడ్డెప్ప, నడ్డినారాయణ, పంచముఖేశ్వరరావు, ఎస్‌.మునిరాజ, గురునాథం, తహసున్నీసా, రెడ్డెప్ప, ఇమామ్‌, లక్ష్మీనారాయణ, జ్ఞానప్రసూన పాల్గొన్నారు.

తిరుపతి సిటీ : సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా చంద్రబాబు అండ్‌ కో మోసపూరిత హామీలను గుప్పించారు. సూపర్‌ సిక్స్‌ అంటూ బూటకపు మేనిఫెస్టోను ప్రకటించారు. ఊరు వాడా తిరుగుతూ ప్రజలను నమ్మించారు. అమలు చేయలేమని తెలిసీ ఇష్టారాజ్యంగా 143 హామీలను మేనిఫెస్టోను తీసుకువచ్చారు. అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి ఆర్థిక స్థితి బాగోలేదంటూ మేనిఫెస్టోను మూలన పడేశారు. అభివృద్ధిని అటకెక్కించి సంక్షేమ పథకాలను గాలికొదిలేశారు. ప్రధానంగా మహిళా శక్తి పేరుతో ఆడపడుచులకు ఇచ్చిన హామీలు తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు వంటి పథకాలను పక్కనపెట్టేశారు. నీకు 15వేలు..నీకు 15వేలు..మరి నీకు 18వేలంటూ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు నేడు చేతులెత్తేశారు. దీపం–2 అంటూ.. ఉచిత గ్యాస్‌ అంటూ జనం చెవిలో పువ్వులు పెట్టేశారు. తూతూమంత్రంగా పథకం అమలు చేస్తున్నారు. పథకం జిల్లాలో కనీసం 30శాతం మందికి కూడా ఉచిత సిలిండర్‌ అందించిన దాఖలాలు లేవు. కుల వృత్తులు, వైద్య, విద్యా రంగాల పరిస్థితి మరింత దయనీయ స్థితికి చేర్చేశారు.

వెటకారపు మాటలు

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ప్రజలను హేళన చేస్తూ వెటకారంగా మాట్లాడడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్‌ పేరుతో హామీలను గుప్పించారు. ఇప్పుడు సంక్షేమ పథకాల అమలు చేయాలంటే డబ్బులు లేవు.. సంపద సృష్టించి తర్వాత అందిస్తాం...అలా సంపద సృష్టించే ఐడియాలు ఏమైనా ఉంటే తనకు చెవిలో చెప్పాలంటూ అవహేళనగా నిండు సభలో చంద్రబాబు మాట్లాడడంతో సూపర్‌సిక్స్‌ పథకాల అమలు అసాధ్యమని తేలిపోయింది. దీంతో బడుగు బలహీన వర్గాలు, పేదలను సైతం బాబు వెన్నుపొటు పొడిచేందుకు వెనుకాడడని ఆయన నైజం మరోసారి బయటపడిందంటూ జిల్లావాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పశ్నించిన వారిని భయబ్రాంతులకు గురి చేస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. తన అనుచరులను, పార్టీ కార్యకర్తలను యథేచ్ఛగా దోచుకోండి.. దాచుకోండి అంటూ ప్రొత్సహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మాయమాటలు చెప్పారు

ప్రజలను వంచించి ఓట్లు వేయించుకున్నారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ఆడబిడ్డ నిధిపై నోరు మెదపడం లేదు. మహానాడు వేదికగా పథకాల అమలుపై స్పష త ఇస్తారనుకున్నాం. ఆ ప్రస్తావనే లేదు. నీకు 15...నీకు...15...నీకు 18 అంటూ ప్రగల్భాలు పలికి మహిళలకు మాయమాటలు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఉన్న పింఛన్‌లను తొలగించారు. నామమాత్రంగా దీపం పథకం పేరుతో కొందరికే నగదు జమచేశారు. బాబు పాలన దారుణంగా ఉంది.– ఓ.అంకమ్మ, సైదాపురం, వెంకటగిరి

పశ్నించే గళం ఏమైంది?

ప్రభుత్వాలు తప్పు చేసినా, సామాన్య ప్రజలకు అన్యాయం జరిగినా స్పందించి ప్రశ్నిస్తాననే పవన్‌ కల్యాణ్‌ గళం ఏమైంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతోంది. కనీసం ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రశ్నించాలి. గత ప్రభుత్వంలో ప్రతి మహిళకు ఏడాదిలోనే జగనన్న లక్షల రూపాయల లబ్ధి చేకూర్చారు. ప్రస్తుతం గ్రామీణ మహిళలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. పట్టించుకునే నాథుడు లేడు. ఆడబిడ్డ నిధి, తల్లికివందనం, ఉచిత బస్సు ఊసే ఎత్తడం లేదు. – బి.ధనమ్మ, యలమంద, చంద్రగిరి

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

ప్రజలను మరోసారి

బురిడీ కొట్టించిన బాబు

ఏడాదిగా అమలు కాని హామీలు

మేనిఫెస్టో మళ్లీ బుట్టదాఖలు

దాడులు.. అక్రమ కేసులు.. అరెస్ట్‌లకే పాలన పరిమితం

సంపద సృష్టి పేరుతో సంక్షేమ

పథకాలకు తూట్లు

చంద్రబాబు వైఫల్యాలపై నేడు కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ నిరసన

వెన్నుపోటు దినంగా పాటిస్తూ ఆందోళన

జిల్లాలో ఏడాదిగా పథకాల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

తిరుపతి 1,89,569

చంద్రగిరి 2,17,678

శ్రీకాళహస్తి 1,75,095

వెంకటగిరి 1,82,767

సూళ్లూరుపేట 1,67,990

గూడూరు 1,51,874

సత్యవేడు 1,39,087

సంక్షేమం కింద ప్రజలకు అందాల్సిన మొత్తం

పథకం లబ్ధిదారుల చేరాల్సిన నగదు

తల్లికి వందనం రూ.870 కోట్లు

ఆడబిడ్డ నిధి రూ.2,359.15కోట్లు

ఉచిత బస్సు రూ.2,123 కోట్లు

అన్నదాత సుఖీభవ రూ.4,598 కోట్లు

నిరుద్యోగ భృతి రూ.984.23 కోట్లు

చెప్పింది ఇదీ.. ఏడాదిగా చేసింది ఇదీ..

సూపర్‌ సిక్స్‌ పథకాలను అందిస్తాం బూటకపు హామీలుగానే మిగిలిపోయాయి

ఏటా 4లక్షల ఉద్యోగాలు.. 5ఏళ్లలో 20లక్షలు ఇచ్చింది శూన్యం

ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్‌ క్యాలెండర్‌ ప్రస్తావనే లేదు

ప్రతి నిరుద్యోగికీ భృతి నెలకు రూ.3వేలు పట్టించుకోలేదు

తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15వేలు ఊరిస్తూనే వస్తున్నారు

అన్నదాత సుఖీభవ కింద రైతుకు ఆర్థిక సాయం రూ.20వేలు ఊసే లేదు

18ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 నోరు మెదపడం లేదు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రస్తావనే ఎత్తలేదు

వలంటీర్లకు గౌరవవేతనం నెలకు రూ.10వేలు వ్యవస్థనే తొలగించేశారు

50ఏళ్లు నిండిన బీసీలకు పింఛన్‌ 12వేల మందికి తీసేశారు

అర్చకులకు నెలకు రూ.15వేలు శఠగోపం పెట్టేశారు

ఉచిత ఇసుక ధరలు పెంచి దోచుకుంటున్నారు

కరెంట్‌ చార్జీలు పెంచే ప్రసక్తే లేదు సామాన్యుడు కట్టలేని స్థాయికి పెంచారు

సత్యవేడులో ఆర్డీఓ కార్యాలయం అవునా...మేం చెప్పామా...!

సత్యవేడులో వంద పడకల ఆస్పత్రి నానుస్తూనే ఉన్నారు

తిరుమల పవిత్రతను కాపాడుతాం అపచారాలు నిత్యకృత్యం

పోటు వృత్తిని కుల వృత్తిగా పరిగణిస్తాం పట్టించుకున్న పాపాన పోలేదు

ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యం జిల్లాలో 10వేల మంది ఉద్యోగుల తొలగింపు

దాడులు.. దౌర్జన్యాలు

కూటమి ప్రభుత్వ పాలన ఏడాది గడుస్తున్నా జిల్లా ప్రజలకు చిల్లిగవ్వ చేతికందలేదు. బాబు పాలన నవ్విపోదురుగాక నాకేంటి.. అన్నట్టు కొనసాగుతోంది. దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భూకబ్జా లు పెరిగిపోయాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కూటమి నేతలు వాలిపోతున్నారు. అధికారులు, సామాన్య ప్రజలను బెదిరించి రాత్రికి రాత్రే జేసీబీలతో చదును చేసుకుని స్వాహా చేస్తున్నారు. ఉచిత ఇసుక అంటూ ఊదరగొట్టి పచ్చమూకకు ప్రకృతి వనరులను అప్పగించేశారు. సీసీ రోడ్లు, భవనాలు, పంచాయితీ పనులు, ఆర్‌ అండ్‌బీ, గనుల కాంట్రాక్టు వంటి పనులను తెలుగుతమ్ముళ్లకు కట్టబెట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేశారు. పశ్నించి వారిపై దాడులకు పాల్పడటం, విచక్షణారహితంగా గాయపరుస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయవద్దని పోలీసులను సైతం శాసిస్తున్నారు.

భక్తుల భద్రతకు భరోసా
1
1/9

భక్తుల భద్రతకు భరోసా

భక్తుల భద్రతకు భరోసా
2
2/9

భక్తుల భద్రతకు భరోసా

భక్తుల భద్రతకు భరోసా
3
3/9

భక్తుల భద్రతకు భరోసా

భక్తుల భద్రతకు భరోసా
4
4/9

భక్తుల భద్రతకు భరోసా

భక్తుల భద్రతకు భరోసా
5
5/9

భక్తుల భద్రతకు భరోసా

భక్తుల భద్రతకు భరోసా
6
6/9

భక్తుల భద్రతకు భరోసా

భక్తుల భద్రతకు భరోసా
7
7/9

భక్తుల భద్రతకు భరోసా

భక్తుల భద్రతకు భరోసా
8
8/9

భక్తుల భద్రతకు భరోసా

భక్తుల భద్రతకు భరోసా
9
9/9

భక్తుల భద్రతకు భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement