
ఎంసెట్ ఫలితాల్లో మెరుపులు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు మే 19 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన ఏపీ ఈఏపీ (ఎంసెట్) ఫలితాలు ఆదివారం విడుదల చేశారు. ఇందులో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రతిభను చాటారు. ఇంజినీరింగ్ విభాగంలో తిరుపతికి చెందిన మాండవ్యపురం భానుచరణ్రెడ్డి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించారు. అలాగే ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో మణిద్వీప్రెడ్డి 7వ ర్యాంకు, ఓ.ఆరుష్ లక్ష్మణ్ 45వ ర్యాంకు, ధనుష్ 59, యశ్విత 69, మౌనిక 94, వి.యశ్వంత్ 135, డి.లావణ్య 230, లక్ష్మీసహస్ర 322, ఎ.జెస్విత 398, కె.జస్విత 444, వై.శివకృతిక్ 492, హర్షవర్ధన్ 528, ఎం.ఉమేష్ 551, ఎం.హిమవర్ష 787, సి.రామలక్ష్మమ్మ 799, వి.లక్ష్మీహర్షిత 800, కె.మంజునాథ మహర్షి 900, కె.టీనారాణి 919, వి.సాధన 925వ ర్యాంకులు దక్కించకుని సత్తా చాటారు.
ఏఐ రంగంలో రాణించాలి
ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును మాండవ్యపురం భానుచరణ్రెడ్డి సాధించారు. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న ఎం.జయభారత్రెడ్డి, ఎం.సురేఖ దంపతుల కుమారుడైన భానుచరణ్రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) రంగంలో రాణించడమే తన లాంగ్ టర్మ్ గోల్ అని తెలిపారు. అందులో భాగంగా ప్రస్తుతం ఐఐటీ బాంబేలో సీటు పొంది సీఎస్ఈ చదవడమే తన లక్ష్యమని వెల్లడించారు.
– మాండవ్యపురం భానుచరణ్రెడ్డి, తిరుపతి