
‘వెన్నుపోటు’ ప్లకార్డుల ఆవిష్కరణ
ప్లకార్డును
ఆవిష్కరిస్తున్న భూమన
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ బుధవారం చేపట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించిన ప్లకార్డులను వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం తిరుపతి పద్మావతిపురంలో నివాసంలో ఆయన మాట్లాడుతూ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వానికి బుద్ది చెప్పేలా నిరసన వ్యక్తం చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ పాల్గొన్నారు.