
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాగిరి
పాకాల : దారి విషయమై వైఎస్సార్సీపీ వర్గీయులను టీడీపీ నాయకులు చితకబాదిన సంఘటన శుక్రవారం పాకాల మండలంలోని మద్దినాయనపల్లి పంచాయతీ ఐయ్యవారిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు స్వర్ణలత, సుబ్బమ్మ, రాణి తెలిపిన వివరాల మేరకు.. తమ ఇంటికి ఆనుకుని గ్రామకఠం, చెరువు పొరంబోకు స్థలాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోవడంతో తమపై దాడికి దిగారని ఆరోపించారు. అధికారం చేతిలో ఉందిని, పక్క గ్రామాల నుంచి టీడీపీ చెందిన రౌడీలను, నాయకులను పిలిపించి దాడులకు పాల్పడ్డారని ఆవేదన చెందారు. ఆడవారని కూడా చూడకుండా జాకెట్లను సైతం చింపేసారని వాపోయారు. ఇదే దారి విషయమై నెల క్రితం కూడా టీడీపీకి చెందిన గూండాలు దౌర్జన్యం చేసారని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు వివరించారు. అయితే బాఽధితుల వైపు నిలవాల్సిన ఎస్ఐ అధికార పార్టీ గూండాలు, నాయకుల కొమ్ము కాస్తూ భాదితులైన తమని బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ ఈ విషయంపై చొరవ చూపాలని కన్నీటి పర్యంతమయ్యారు. రెవెన్యూ అఽధికారులు కూడా టీడీపీ గూండాలకే మద్దతు తెలుపుతూ వారికి అనుకూలంగా పత్రాలను సృష్టించి పేదలకు అన్యాయం చేస్తున్నారని బాధకు లోనయ్యారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి దాడికి పాల్పడ్డ టీడీపీ గూండాలపై కేసు నమోదు చేసి కఠిన శిక్ష విధించాలని బాధితులు వాపోయారు. గొడవకు చెందిన సంఘటనను వీడియో తీస్తున్న శంకరపై దాడికి దిగి రక్త గాయాలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ కంఠం, చెరువు పొరంబోకు
స్థలం ఆక్రమణకు యత్నం
సహకరిస్తున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు
భయం గుప్పెట్లో వైఎస్సార్సీపీ
సానుభూతిపరులు

వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాగిరి