
వెన్నుపోటు దినం.. ఊరూరా ఉద్యమం
● ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ● నేడు జిల్లావ్యాప్తంగా ఆందోళనకు సన్నద్ధమైన శ్రేణులు
తిరుపతి అర్బన్ : కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ప్రభుత్వం వైఖరిపై ప్రజలు మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీతో కలసి బుధవారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
గూడూరు : వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నేతృత్వంలో పట్టణంలోని టౌన్క్లాక్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. సర్కార్ తీరును ఎండగడుతూ నిరసన చేపట్టనున్నారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు,కార్యకర్తలతోపాటు స్వచ్ఛందంగా ప్రజలు హజరుకానున్నారు.
వెంకటగిరి : వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నేతృత్వంలో రాపూరులోని పడమటి వీధి సిద్ధులయ్య ఆల యం నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లనన్నారు. అనంతరం నిరసన చేపట్టనున్నారు.
సత్యవేడు : వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో వరదయ్యపాళెం ఆర్టీసీ బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు చేసిన మోసాలను వివరించనున్నారు.
శ్రీకాళహస్తి : వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి నేతృత్వంలో పట్టణంలోని శ్రీరామనగర్కాలనీలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకోనున్నారు. అనంతరం కూటమి సర్కార్లో దోపిడీ విధానం, కక్ష సాధింపు చర్యలు, అమలు చేయని హామీలపై నిరసన చేపట్టనున్నారు.
తిరుపతి: తిరుపతి నగరంలోని జీవకోన నుంచి లీలామహల్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాలఅధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ మద్దిల గురుమూర్తి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి, మేయర్ శిరీషా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించనున్నారు.
చంద్రగిరి : వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి టవర్క్లాక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టనున్నారు. స్థానికంగా జరుగుతున్న అరాచకాలతోపాటు కూటమి సర్కార్ ఇచ్చిన హామీల నెరవేర్చకపోవడంపై నిరసన వ్యక్తం చేయనున్నారు.
సూళ్లూరుపేట : వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో నాయుడుపేటలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం నిరసన వ్యక్తం చేయనున్నారు.