వరుస భేటీలు.. విషయం ఏంటో? | - | Sakshi
Sakshi News home page

వరుస భేటీలు.. విషయం ఏంటో?

Jun 4 2025 12:47 AM | Updated on Jun 4 2025 12:47 AM

వరుస

వరుస భేటీలు.. విషయం ఏంటో?

తిరుపతి అర్బన్‌ : నియోజకవర్గ అభివృద్ధి కోసం.. ప్రజా సమస్యలు పరిష్కారం కోసమంటూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను కలిశారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం నోరెత్తిన దాఖలాలు లేవు. కానీ...కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను మాత్రం పదేపది కలుస్తున్నాన్నారు. నియోజకవర్గంలోని పలు సమస్యలపై కలెక్టర్‌ను కలిసినట్లు సమాచారశాఖ ద్వారా ఓ ప్రకటన విడుదల చేయిస్తున్నారు. సొంత సమస్యలో...లేదా ప్రజా సమస్యలో తెలియడం లేదు...మొత్తానికి కలెక్టర్‌ను మాత్రం తరచూ కలుస్తున్నారంటూ జిల్లాలోని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే సమాచారశాఖ వారు విడుదల చేస్తున్న ప్రకటనలోనే ఏ సమస్యపై కలెక్టర్‌తో చర్చించారో...ఆ సమస్య ఎంత మేర పరిష్కరించారో తెలియజేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.

వరుస భేటీలు.. విషయం ఏంటో?1
1/1

వరుస భేటీలు.. విషయం ఏంటో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement