
మెరుగైన పారిశుద్ధ్యమే లక్ష్యం
తిరుపతి తుడా : ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో మెరుగైన పారిశుద్ధ్యమే లక్ష్యంగా నగరపాలక సంస్ధ అధికారులు, సిబ్బంది పనిచేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్ కుమార్ ఆదేశించారు. బుధవారం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ మౌర్య, ఆర్డీ విశ్వనాథ్తో కలసి వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. డైరెక్టర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో అన్ని విభాగాల పనితీరును అభినందించారు. మరింత మెరుగ్గా పలితాలు వచ్చేలా పనిచేయాలని సూచించారు.ఇంటింటి చెత్త సేకరణ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. పన్నుల వసూలులో మరింత వేగం పెంచాలని చెప్పారు. టౌన్ ప్లానింగ్ విభాగం పక్కా ప్రణాళికతో పనిచేయాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఎస్ఈ శ్యామ్సుందర్, ఎంఈలు తులసి కుమార్, గోమతి పాల్గొన్నారు.
‘బర్డ్’ అభివృద్ధికి కృషి
తిరుపతి తుడా : బర్డ్ ఆస్పత్రి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని డాక్టర్ జగదీష్ తెలిపారు. బుధవారం ఆయన ఆస్పత్రి డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. జగదీష్ మాట్లాడుతూ బర్డ్లో సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించిన అనుభవం ఉందన్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో ఆస్పత్రి గుర్తింపు ఇనుమడించేలా సేవలు విస్తరిస్తామని వెల్లడించారు. అనంతరం పలువురు వైద్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.
భవన నిర్మాణాల పరిశీలన
తిరుపతి తుడా : స్విమ్స్ ప్రాంగణంలో నిర్మిస్తున్న భవనాలను టీటీడీ ఈఓ శ్యామలరావు అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ముందుగా రోగుల సహాయక వసతి గృహంలోని గదులు, భోజనశాల, మరుగుదొడ్లను తనిఖీ చేశారు. సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సిటీ సర్జరీ తదితర వైద్య సేవల కోసం నిర్మిస్తున్న భవనాన్ని సందర్శించారు. సెంట్రల్ కిచెన్, సెంట్రల్ మెడికల్ స్టోర్స్, స్విమ్స్ పద్మావతి ఆస్పత్రి, నిర్మాణంలోని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ , స్టాఫ్ క్వార్టర్స్, శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం భవనాలను పరిశీలించారు. మౌలిక వసతులు, తదితర అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు.కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, టీవీ సత్యనారాయణ, ఎస్ఈలు వెంకటేశ్వర్లు, మనోహరం పాల్గొన్నారు.

మెరుగైన పారిశుద్ధ్యమే లక్ష్యం

మెరుగైన పారిశుద్ధ్యమే లక్ష్యం