
● 11 నెలల పాలనలో ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కూటమ
చిల్లకూరు: జిల్లాలో ఆదాయం వచ్చే ఆలయాలపై కూటమి నేతల కన్ను పడింది. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో అనధికారికంగా కమిటీలు ఏర్పాటు చేసుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. కొందరు ఈఓలు వారి పెత్తనాన్ని తట్టుకోలేకపోతుంటే.. మరికొందరు మాత్రం దొరికిందే అవకాశం అన్నట్లు ఆలయ నిధులను అనవసర కార్యక్రమాలు నిర్వహించి చేతివాటం చూపిస్తున్నారు. మామూలుగా అయితే ఆదాయం రూ.5 లక్షలకు మించి వచ్చే ప్రతి ఆలయాలకు ప్రభుత్వం పాలకమండలి కమిటీలను నియమిస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇప్పటివరకు వీటి గురించి పట్టించుకోలేదు. అయితే కొందరు నేతలు మాత్రం తమ ప్రాంత పరిధిలోని ఆలయాలకు తామే కాబోయే కమిటీ అధ్యక్షుడిని అంటూ ఈఓలపై అప్పుడే పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో కొందరు ఈఓలు కూటమి నేతల పెత్తనాన్ని తట్టుకోలేక చేష్టలుడిగి చూస్తున్నారు. కొంతమంది ఈఓలు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని అనధికారిక కమిటీలతో కలసి చేతివాటం చూపిస్తున్నారు. అనవసర ఖర్చులు చేయిస్తూ దేవుడి నిధులను స్వాహా చేస్తున్నారు.
బడ్జెట్ ఆమోదం పొందిన తరువాతే..
ఆలయ కమిటీల మెంబర్లమని చెప్పుకుంటున్న నేతలు ఆడిటర్లకు వాటాలు పంచుతూ కార్యక్రమాల్లో ఆధ్యాత్మికతను పక్కన పెట్టి రికార్డింగ్ డ్యాన్సు(ఈవెంట్)లు చేయించి ఇష్టారీతిలో భారీగా నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులోని ముత్యాలమ్మ ఆలయంలో గత నెలలో నాలుగు రోజుల పాటు జరిగిన జాతరకు ఆరు లక్షల మంది వరకు భక్తులు వచ్చారు. తద్వారా ఆలయానికి సుమారు రూ.కోటి వరకు ఆదాయం వచ్చింది. ఇదే మండలంలోని తమ్మినపట్నంలో కోదండరామస్వామి ఆలయానికి కూడా రూ.కోట్ల నిధులు ఉన్నాయి. మరి ఈ ఆలయంలో నవమి వేడుకలను నిర్వహించేందుకు దేవదాయశాఖ ఎన్ని రూ.లక్షల నిధులు విడుదల చేసిందనే విషయం తెలియదు. కానీ అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న కమిటీ ఆ నిధులతో పాట కచేరీలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఆలయానికి కొత్తగా వచ్చిన ఈఓ కూడా నిధుల వినియోగంలో ఉన్నతాధికారులను ఏమార్చి భారీస్థాయిలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడైనా రికార్డింగ్ డ్యాన్స్లు ఏర్పాటు చేస్తే అడ్డుకునే పోలీసులు ఈ కార్యక్రమాలను దగ్గర ఉండి ప్రోత్సహించడం కొసమెరుపు. దీన్ని బట్టి దేవదాయశాఖ నిధులు ఎంత దుబారా చేస్తున్నారనే విషయం తేటతెల్లమవుతోంది.
జీఓ విడుదల చేయలేదు..
ఆలయాల్లో పాలక మండళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి జీఓ విడుదల చేయలేదు. కనీసం ఉత్సవ కమిటీలను కూడా నియమించేలా ఆదేశాలు అందలేదు. పలు ఆలయాల్లో కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించుకుంటున్న విషయం నా దృష్టికి రాలేదు. ఇలాంటివి ఏమైనా ఉంటే ఆయా ఆలయాల ఈఓలతో మాట్లాడి చర్యలు చేపడతాం. తమ్మినపట్నం కోదండరామస్వామి ఆలయంలో అనుమతులు లేకుండానే నవమి ఉత్సవాలకు భారీగా ఖర్చు చేసిన విషయాలు ఆర్జేసీ ఆజాద్ చూశారు. నాకు ఆ విషయం తెలియదు. – రామకృష్ణారెడ్డి,
దేవదాయశాఖ కమిషనర్, తిరుపతి
గూడూరు డివిజన్లో 23 ఆలయాలకు..
గూడూరు డివిజన్ పరిధిలోని గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో సుమారు 23 ఆలయాల్లో గత ప్రభుత్వం పాలకమండళ్లు ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని రద్దు చేయడంతో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానిక కూటమి నేతలు ఆలయాల్లో జరిగే జాతరలు, ఉత్సవాలు, పండుగలు నడిపించేందుకు పట్టుబడుతున్నారు. వారికి సపోర్టుగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చూసీచూడనట్లు పోండయ్యా అని దేవదాయశాఖ అధికారులతో చెప్పడంతో ఆలయ ఈఓలు మాకు ఏంటి ఈ ఖర్మ అనుకుంటూ వారు చెప్పినట్లు నడుచుకుంటున్నారు.

● 11 నెలల పాలనలో ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కూటమ

● 11 నెలల పాలనలో ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కూటమ