
ఎస్వీయూ ఎగ్జామినేషన్ డీన్గా సురేంద్రబాబు
తిరుపతి సిటీ: ఎస్వీయూ లైబ్రరీ ఇన్చార్జిగా కొనసాగుతున్న ప్రొఫెసర్ కె.సురేంద్రబాబును వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్గా నియమిస్తూ వీసీ అప్పారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురేంద్రబాబు వీసీ చాంబర్లో వీసీ, రిజిస్ట్రార్ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. గతంలో డీన్గా ఉన్న ప్రొఫెసర్ ఎస్ కిషోర్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
విద్యుదాఘాతంతో
వృద్ధురాలి మృతి
పాకాల : మండలంలోని మొగరాల పంచాయతీ గెనుంగుట్లపల్లెలో విద్యుదాఘాతంతో ఓ వృద్ధురాలు బుధవారం మృతి చెందింది. వివరాలు.. గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఆన్ చేశారు. అదే సమయంలో ఇంటి గేటును పట్టుకుని ఉన్న కాంతమ్మ(74)కు షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే మరణించింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధురాలికి గాయాలు
పాకాల : మండలంలోని ఇరుగురురంగయ్యగారిపల్లె వద్ద బుధవారం రోడ్డు దాటున్న మరియమ్మ అనే వృద్ధురాలిని 104 వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో మరియమ్మ కుడి కాలు విరిగింది. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీని పై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

ఎస్వీయూ ఎగ్జామినేషన్ డీన్గా సురేంద్రబాబు

ఎస్వీయూ ఎగ్జామినేషన్ డీన్గా సురేంద్రబాబు