
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 12,829 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 44 మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.92 లక్షలకు చేరుకుంది. తాజాగా 34 మంది కోలుకోగా, మొత్తం 7.87 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 364 క్రియాశీలక కేసులున్నాయి.