
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం 12,870 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 45 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.92 లక్షలకు చేరింది. తాజాగా 28 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు 7.88 లక్షల మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 413 మంది చికిత్స పొందుతున్నారు.