
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 8,456 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయ గా, అందులో 102 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.35 లక్షలకు చేరింది. ఒక రోజులో కరోనా నుంచి 175 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8.29 లక్షలకు చేరింది. ప్రస్తుతం 1,116 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.