పోలింగ్‌పై అవగాహన పెంచేందుకు క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌పై అవగాహన పెంచేందుకు క్రీడా పోటీలు

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 7:47 AM

వేలూరు: అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం పోలింగ్‌కు కోసం పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా వేలూరు జిలాల గుడియాత్తం సమీపంలోని పాక్కం గ్రామ సమీపంలో మారథాన్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కలెక్టర్‌ సుబ్బలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో పాఠశాల, కళాశాలలకు చెందిన విద్యార్థులు సుమారు 200 మంది కలుసుకున్నారు. అనంతరం మారథాన్‌ పోటీలు గుడియాత్తం బస్టాండ్‌ వరకు సుమారు ఐదు కిలో మీటరు దూరం వరకు పోటీలు జరిగింది. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు వేర్వేరుగా కలెక్టర్‌ బహుమతులను అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వందశాతం పోలింగ్‌ కావాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం క్రీడాపాధికార సంస్థ, మహిళా సమాఖ్య సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించి అవగాహన కల్పించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం శిశు సంక్షేమ శాఖ అద్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలచే గుడియాత్తం సమీపంలోని పాక్కం గ్రామం వద్ద వందశాతం పోలింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement