అందరూ సంయమనం పాటించాలి | - | Sakshi
Sakshi News home page

అందరూ సంయమనం పాటించాలి

Oct 28 2025 8:42 AM | Updated on Oct 28 2025 8:46 AM

● విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌లో జస్టిస్‌ రాజమాణిక్యం

కొరుక్కుపేట: అందరూ సంయమనం పాటించాలని తమిళనాడు లోకాయుక్త చైర్‌పర్సన్‌ జస్టిస్‌ పి.రాజమణిక్యం అన్నారు. సదరన్‌ రైల్వే ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌ను పాటిస్తోంది. అందులో భాగంగా సోమవారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్‌ పి.రాజమాణిక్యం పాల్గొన్నారు. చైన్నెలోని సదరన్‌ రైల్వే ప్రధాన కార్యాలయంలో విజిలెన్స్‌ విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సదరన్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఆర్‌ఎన్‌ సింగ్‌, ప్రధాన విభాగాల అధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ అవేర్‌ నెస్‌ వీక్‌ను ప్రారంభించిన జస్టిస్‌ పి.రాజమాణిక్యం మాట్లాడుతూ ఈ సంవత్సరం విజిలెన్స్‌–మా భాగస్వామ్య బాధ్యత అనే థీమ్‌తో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అవినీతి, దుష్ప్రవర్తన, లంచం, నిధుల దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన వివిధ చట్టాల నిబంధనలను ఆయన వివరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో సదరన్‌ రైల్వే చురుకై న చర్యలను ప్రశంసించారు. రైల్వే కార్యకలాపాల సామర్థ్యాన్ని సమష్టిగా పెంచిన సాంకేతికత వినియోగం, నివారణ విజిలెన్స్‌ తనిఖీలు, వ్యవస్థాగత మెరుగుదలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌లో భాగంగా సదరన్‌ రైల్వే విజిలెన్స్‌ విభాగం ఇంటిగ్రిటీ బులెటిన్‌–2025ను విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement