3,500 ఆలయాల్లో కుంభాభిషేకం నిర్వహిస్తాం | - | Sakshi
Sakshi News home page

3,500 ఆలయాల్లో కుంభాభిషేకం నిర్వహిస్తాం

Jul 14 2025 5:01 AM | Updated on Jul 14 2025 5:01 AM

3,500

3,500 ఆలయాల్లో కుంభాభిషేకం నిర్వహిస్తాం

–మంత్రి శేఖర్‌బాబు

సేలం: ఈ ఏడాది చివరి నాటికి 3,500 దేవాలయాల్లో కుంభాభిషేకం నిర్వహిస్తామని హిందూదేవదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. ఈరోడ్‌ కొండపై తిండల్‌ వేలాయుధస్వామి ఆలయం ఉంది. హిందూధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయంలో ప్రస్తుతం రాజగోపురం నిర్మించే పనులు జరుగుతున్నాయి. దీని తర్వాత ఆలయం ముందు 186 అడుగుల ఎత్తైన మురుగన్‌ విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించి, దానికోసం పనులు ప్రారంభించారు. ఆదివారం మంత్రులు శేఖర్‌బాబు, ముత్తుసామి పనులను పరిశీలించారు. మంత్రి శేఖర్‌బాబు మాట్లాడుతూ ద్రవిడ మోడల్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ పునరుద్ధరణలు ప్రారంభమయ్యాయని తెలిపారు. హిందూ మతపరమైన ఎండోమెంట్స్‌ అండ్‌ చారిటీస్‌ చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచి చేపట్టని పునరుద్ధరణల పనులకు ఆటంకం ఏర్పడింది. ఈ సంవత్సరం చివరి నాటికి 3,500 ఆలయాల్లో పునరుద్ధరణలు పూర్తవుతాయని అన్నారు. 186 అడుగుల ఎత్తులో ఆసియాలోనే ఎత్తైన విగ్రహాన్ని ఈరోడ్‌ తిండాల్‌ వేలాయుధ స్వామి ఆలయంలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

3,500 ఆలయాల్లో కుంభాభిషేకం నిర్వహిస్తాం 1
1/1

3,500 ఆలయాల్లో కుంభాభిషేకం నిర్వహిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement