రూ.36.06 కోట్లతో ఆవడిలో బస్టాండ్‌ | - | Sakshi
Sakshi News home page

రూ.36.06 కోట్లతో ఆవడిలో బస్టాండ్‌

Jul 11 2025 12:42 PM | Updated on Jul 11 2025 12:42 PM

రూ.36.06 కోట్లతో ఆవడిలో బస్టాండ్‌

రూ.36.06 కోట్లతో ఆవడిలో బస్టాండ్‌

తిరువళ్లూరు: ఆవడిలో రూ.36.06 కోట్లతో నూతనంగా నిర్మించనున్న బస్టాండుకు మంత్రులు శేఖర్‌బాబు, నాజర్‌ భూమిపూజ చేశారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలో నూతన బస్టాండు నిర్మాణం కోసం 2024–25 బడ్జెట్‌లో నిధులను కేటాయించారు. 1.90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ బస్టాండుకు భూమిపూజను గురువారం ఉదయం నిర్వహించారు. మంత్రి శేఖర్‌బాబు మాట్లాడుతూ ఆవడిలో నిర్మించనున్న బస్టాండులో తాగునీరు, ఇంటర్‌నెట్‌ సదుపాయం, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్‌, ప్రయాణికుల సీటింగ్‌ సదుపాయంతో నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ పనులను ఏడాదిలోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రకాష్‌, అదనపు కార్యదర్శి శివజ్ఞానం, ఎంటీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రభుశంకర్‌, మేయర్‌ ఉదయకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement