రోగులకు హెల్ప్‌లైన్లు! | - | Sakshi
Sakshi News home page

రోగులకు హెల్ప్‌లైన్లు!

Jun 13 2025 5:29 AM | Updated on Jun 13 2025 5:29 AM

రోగులకు హెల్ప్‌లైన్లు!

రోగులకు హెల్ప్‌లైన్లు!

సాక్షి, చైన్నె: రోగులకు అత్యవసర సమయాల్లో హెల్ప్‌లైన్లు మరింత తోడ్పాటుగా ఉన్నాయని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్‌ తెలిపారు. కావేరి ఆస్పత్రి 24 గంటల డయాబెటిస్‌ హెల్ప్‌లైన్‌ సేవలను తమిళనాడు వ్యాప్తంగా విస్తరించే విధంగా, రోగులకు మరింత మెరుగైన సేవలు అందించే రీతిలో చర్యలు తీసుకున్నారు. వైద్యుల మార్గదర్శకత్వంలో అత్యవసర సమాయాల్లో డయాబెటీస్‌ రోగులకు ఈ సేవ ఉపయోగకరంగా ఉన్నట్టు మంత్రి అన్నారు. తొలుత ప్రకటించిన ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా నిరంతరాయంగా 1,500 రోజుల సేవలు సాగడం ఒక మైలురాయిగా పేర్కొన్నారు. వైద్య సంరక్షణ బృందాలతో కూడిన హెల్ప్‌లైన్‌ ప్రభావాన్ని రోగులు గుర్తిస్తున్నారని, దీర్ఘ కాలిక సంరక్షణ సేవల్లో నిరంతర ఆవిష్కరణలను వైద్యులు ప్రోత్సహిస్తున్నారని వివరించారు. ఈ హెల్ప్‌లైన్‌కు డయాబెటిస్‌ విద్యా వేత్తలు, నిపుణులు, వైద్యులు, డైటీషియన్లు, డేటా – మానిటరింగ్‌ నిపుణులతో ప్రత్యేక బృందం మద్దతుగా నిలవడం మరింత ఉపయోగకరంగా వివరించారు. త్వరితగతిన సాయం, సేవలు అందించడం ద్వారా రోగులకు ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు.ఆస్పత్రి సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ భరణీధరన్‌, ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ అరవింద్‌ సెల్వరాజన్‌ పాల్గొన్నారు.

ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement