
మళ్లీ అధికారం తథ్యం
● రైతన్నలు మా వెంటే ● సీఎం స్టాలిన్ ధీమా ● ఈరోడ్లో వ్యవసాయ ప్రదర్శన ప్రారంభం ● నేడు కురువై సాగుకు కావేరి నీళ్లు
సాక్షి, చైన్నె : రానున్న 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ద్రవిడ మోడల్ 2.ఓ అధికారంలోకి రావడం తథ్యమని సీఎం స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. రైతన్నలంతా తమ వెన్నంటే ఉన్నారని అన్నారు. ఈరోడ్లో వ్యవసాయ ప్రదర్శనను బుధవారం సీఎం స్టాలిన్ ప్రారంభించారు.
వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ తరఫున ‘వ్యవసాయ ప్రదర్శన, సెమినార్–2025‘ ఉత్సవం బుధవారం ప్రారంభమైంది. ఈరోడ్ జిల్లాలోని పెరుందురై విజయమంగళంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను స్టాలిన్ ప్రారంభించారు. వ్యవసాయరంగంలో ఆధునిక సాంకేతికతలు, అధికదిగుబడిని ఇచ్చే కొత్త రకాల పంటలు, వ్యవసాయ పద్ధతులు, యంత్రాలు, విలువ ఆధారిత సాంకేతికతలపై రైతులు, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రదర్శనను ప్రారంభించిన స్టాలిన్ పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ, తమిళనాడు డెయిరీ ఉత్పత్తిదారుల సహకార నెట్వర్క్ (ఆవిన్), తమిళనాడు ఆహార ప్రాసెసింగ్ , వ్యవసాయ ఎగుమతి ప్రమోషన్ కార్పొరేషన్, సెరికల్చర్ అభివృద్ధి విభాగం, తమిళనాడు సహకార మార్కెటింగ్ నెట్వర్క్, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన సంస్థలు, సహకార సంస్థలు, తమిళనాడు వ్యవసాయ వర్సిటీ, తమిళనాడు వెటర్నరీ సైన్సెస్ విశ్వవిద్యాలయం, ఫిషరీస్ విశ్వవిద్యాలయం, బ్యాంకులు, పంట బీమా కంపెనీలు, నాబార్డ్ వంటి వివిధ సంస్థలు కొలువుదీర్చిన ప్రదర్శనలను వీక్షించారు. సూక్ష్మ నీటిపారుదల, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల తయారీ, విత్తన, బ్యాంకులు, పంటల బీమా కంపెనీలు, చక్కెర మిల్లులు ఈ ప్రదర్శనకు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. మంత్రులు ఏవీ వేలు, ఎంఆర్కే పన్నీరుసెల్వం, ఎస్.ముత్తుస్వామి, ఎం.పి. స్వామినాథన్, కయల్విజి సెల్వరాజ్, తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి విజయన్, ఎంపీలు అందియూరు సెల్వరాజ్, ప్రకాష్, హాజరయ్యారు. అలాగే, ఈరోడ్ జిల్లాలో పూర్తయిన 16 ప్రాజెక్టులను ప్రారంభించారు. మరో 11 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.25.41 కోట్ల విలువైన సంక్షేమ సహాయకాలను 4,524 మంది రైతులకు అందజేశారు.
పొటో:34: వడపళణి బస్టాండ్
న్యూస్రీల్
మద్దతుగా ఉండండి
సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ అన్నదాతల వల్లే ఈ భూమి సుభిక్షంగా ఉందని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈరోడ్ విశిష్టత, ఇక్కడ సాగుబడి, సెలయేర్లు, రిజర్వాయర్లు, నదులను గుర్తుచేస్తూ, ఇది భారతదేశ ‘పసుపు నగరం’ అని, అందుకే ఈ సారి ప్రదర్శనకు వేదికగా ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని అందరం ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవశ్యం ఉందని సూచించారు. రైతుల ప్రగతి పయనం కొనసాగాలని , ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సారవంతమైన భూములు, పంటలమధ్య కలుపు మొక్కల వలే గత పాలకులు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారని, అన్నదాతలను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. కలుపు మొక్కలు మళ్లీ పెరిగే ప్రయత్నం చేస్తున్నాయని, వాటిని తొలగించేందుకు రైతాంగం సిద్ధం కావాలన్నారు. ద్రవిడ నమూనా ప్రభుత్వం అందిస్తూ వస్తున్న పథకాలు, సహకారం, తోడ్పాటు గురించి వివరిస్తూ మళ్లీ ద్రావిడ మోడల్ 2.ఓ రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా డెల్టా వర ప్రదాయిని మేట్టూరు జలాశయం నుంచి ఈ ఏడాది నిర్ణీత జూన్12 గురువారం డెల్టా జిల్లాల్లో కరువై సాగు నిమిత్తం నీటి విడుదల జరగనుంది. నీటిని విడుదల చేయడానికి సీఎం స్టాలిన్ సిద్ధమయ్యారు.

మళ్లీ అధికారం తథ్యం

మళ్లీ అధికారం తథ్యం