స్వయం సహాయక చిహ్నంగా ‘మధి’ | - | Sakshi
Sakshi News home page

స్వయం సహాయక చిహ్నంగా ‘మధి’

Jun 12 2025 7:29 AM | Updated on Jun 12 2025 7:29 AM

స్వయం

స్వయం సహాయక చిహ్నంగా ‘మధి’

సాక్షి, చైన్నె : స్వయం సహాయక సంఘాలకు చిహ్నంగా మధి పేరిట లోగోను బుధవారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ ఆవిష్కరించారు. మణి మేఘలై అవార్డులను ప్రదానం చేశారు. రూ. 3134 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. చైన్నెలోని కలైవానర్‌ అరంగంలో మహిళా సంక్షేమ విభాగం నేతృత్వంలో స్వయం సహాయక బృందాలకు మని మేఘలై అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33,312 స్వయం సహాయక సంఘాల్లోని 3,76,443 మంది సభ్యులకు రూ.3134.21 కోట్ల విలువైన బ్యాంక్‌ రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. చైన్నెలో 1,401 స్వయం సహాయక బృందాల్లోని 14,083 మంది సభ్యులకు రూ.123.65 కోట్ల విలువైన బ్యాంకు రుణాలను అందజేశారు. తమిళనాడులోని వివిధ జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 20 స్వయం సహాయక సంఘాలకు తలా రూ.లక్షతోపాటు అవార్డులు ప్రదానం చేశారు. ఐదు పంచాయతీ స్థాయి సంఘాలకు తలా మూడు లక్షలు, ఐదు గ్రామ సంఘాలకు తలా రూ. 5 లక్షల చెక్కులను అందజేశారు. దిండిగల్‌లో జిల్లా స్థాయిలోని రెడ్డియార్‌ చత్రం సంఘాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలతోపాటు మణి మేఘలై అవార్డు, సేలం జిల్లా సూర మంగళం నగర స్థాయి సంఘాలకు అవార్డులతో పాటు తలా రూ. ఐదు లక్షలు అందజేశారు. 2024–2025 సంవత్సరానికి గాను వివిధ సంఘాలకు మణిమేకలై అవార్డులతో మొత్తం రూ. 59.00 లక్షల విలువైన చెక్కులను డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్‌ అందజేశారు. చైన్నెలోని నెహ్రూ పార్క్‌లో ఇటీవల స్వయం సహాయక సంఘాలకు రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఇందులో 20 సంఘాలకు అవార్డులు, రూ. 2.75 లక్షలు విలువైన చెక్కులను బహుమతిగా పంపిణీ చేశారు.

మధి లోగో ఆవిష్కరణ

స్వయం సహాయ బృందాలు రూపొందించిన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించారు. స్వయం సహాయక బృందాలకు చిహ్నంగా మధి పేరిట లోగోను విడుదల చేశారు. నాణ్యతతో కూడిన వేరుశనగ నూనెను పరిచయం చేశారు. ఈ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో మహిళా స్వయం సహాయక సంఘాలు రూపొందించిన వివిధ ఉత్పత్తులను కొలువు దీర్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శేఖర్‌ బాబు, చైన్నె మేయర్‌ ఆర్‌ ప్రియ, ఎంపీ దయానిధి మారన్‌, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ, మహిళా అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రేయ పి సింగ్‌, మహిళా స్వయం సహాయక బృందం సభ్యులు కె. విజయలక్ష్మి, ఎస్‌, శరణ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయ నిధి స్టాలిన్‌ మాట్లాడుతూ డీఎంకేకు బలం మహిళా శక్తి అన్నారు. వారి మద్దతుతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రూ. 3,134 కోట్ల రుణాల పంపిణీ

మణి మేఘలై అవార్డుల ప్రదానం

స్వయం సహాయక చిహ్నంగా ‘మధి’ 1
1/2

స్వయం సహాయక చిహ్నంగా ‘మధి’

స్వయం సహాయక చిహ్నంగా ‘మధి’ 2
2/2

స్వయం సహాయక చిహ్నంగా ‘మధి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement