ఆవడి ఆర్మీ ఫ్యాక్టరీలో కరణ్‌బీర్‌ సింగ్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఆవడి ఆర్మీ ఫ్యాక్టరీలో కరణ్‌బీర్‌ సింగ్‌ పరిశీలన

Jun 11 2025 8:56 AM | Updated on Jun 11 2025 8:56 AM

ఆవడి

ఆవడి ఆర్మీ ఫ్యాక్టరీలో కరణ్‌బీర్‌ సింగ్‌ పరిశీలన

సాక్షి, చైన్నె : ఆవడిలోని ఆర్మీ వెహికల్స్‌ తయారీ కర్మాగారాన్ని దక్షిణ భారత ఏరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ కరణ్‌బీర్‌సింగ్‌ బ్రార్‌ మంగళవారం సందర్శించారు. ఇక్కడ తయారవుతున్న ఉత్పత్తులను పరిశీలించారు. చైన్నె శివారులోని ఆవడిలో ఆర్ముర్డ్‌ వెహికల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌ పేరిట కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో భారత సైన్యానికి అవసరమయ్యే యుద్ధ ట్యాంకర్లు, వివిధ ఆయుధాల ఉత్పత్తి జరుగుతున్న విషయం తెలిసిందే. భారత రక్షణ రంగంలో కీలక పాత్రను పోషిస్తున్న ఈ యుద్ధ ట్యాంకర్ల ఫ్యాక్టరీని జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ కరణ్‌బీర్‌సింగ్‌ బ్రార్‌ సందర్శించారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న వివిధ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. ఇక్కడ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడం, సకాలంలో సైన్యానికి సరఫరా చేసే దిశగా, స్వదేశీ టెక్నాలజీ ఉత్పత్తుల గురించి ఈ సందర్భంగా అధికారులతో కరణ్‌బీర్‌సింగ్‌ సమీక్షించారు. భవిష్యత్‌లో యుద్ధ అవసరాలు, రక్షణ రంగంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాల్సిన అవసరాన్ని వివరించారు. ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు సాంకేతిక అంశాలు, ఏవీఎన్‌ఎల్‌లో అనుసరించాల్సిన సాంకేతికతను చెప్పారు.

ఆవడి ఆర్మీ ఫ్యాక్టరీలో కరణ్‌బీర్‌ సింగ్‌ పరిశీలన 1
1/1

ఆవడి ఆర్మీ ఫ్యాక్టరీలో కరణ్‌బీర్‌ సింగ్‌ పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement