
మిసెస్ అండ్ మిస్టర్ పోస్టర్ల ఆవిష్కరణ
అనంతన్కాడు చిత్రంలో ఆర్య
తమిళసినిమా: పాత్రలో పస ఉంటేనే నటించడానికి సమ్మతించే నటి సాయిపల్లవి. నిరాకరించిన చిత్రాలు నిరాశపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. కథానాయకిగా తొలి చిత్రం ప్రేమమ్ నుంచి సమీప కాలంలో నటించిన తండేల్ వరకు వైవిధ్యభరితమైన కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్న సాయిపల్లవికి దక్షిణాది సినిమాల్లో కథానాయకిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలా వరుస విజయాలతో తన ప్రత్యేకతను చాటుకుంటున్న కథానాయకి సాయిపల్లవి. ప్రస్తుతం బాలీవుడ్లో మకాం పెట్టారు. అక్కడ పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న రామా యణం చిత్రంలో సీతగా నటిస్తున్నారు. చిత్రాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేస్తున్న సాయిపల్లవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ముఖ్యంగా మీ బయోపిక్తో చిత్రం రూపొందితే దానికి టైటిల్ ఏమి పెట్టవచ్చు అన్న ప్రశ్నకు ఠక్కున బదిలిచ్చిన సాయి పల్లవి తన బయోపిక్ను రెడీ చేసి దానికి పేరేమి పెట్టాలని అడిగితే కచ్చితంగా 50 షేడ్స్ ఆఫ్ పల్లవి అని పెట్టాలని చెబుతానన్నారు. ఎందుకంటే ఒకరి వద్ద మనం ఒక్కోలా ఉంటామన్నారు. తాను అంతేనన్నారు. స్నేహితుల మధ్య ఉన్నప్పుడు ఒకరకంగానూ అదే ఇండస్ట్రీలో, షూటింగ్ సెట్స్లో ఉన్నప్పుడు వేరే విధంగా ఉంటామన్నారు. ఇక అమ్మ,నాన్న వద్ద ఉన్నప్పుడు ఇంకోలా ఉంటామన్నారు. అందుకే తన బయోపిక్తో చిత్రం చేస్తే, దానికి 50 షేర్స్ ఆఫ్ పల్లవి అనే టైటిల్ కరెక్ట్గా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. సాయిపల్లవి జీవిత చరిత్రతో చిత్రం రూపొందుతుందో లేదో గానీ ఆమె చెప్పిన ఈ టైటిల్ మాత్రం సూపర్గా ఉందని అంటున్నారు నెటిజన్లు.
తమిళసినిమా: కోలీవుడ్లో గోల్డ్ అండ్ బ్యూటీఫుల్ అండ్ డేరింగ్ నటి వనితా విజయ్కుమార్. ఇంతకుముందు కథానాయకిగా నటించినా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. అలాంటిది ఈమె తాజాగా మెగాఫోన్ పట్టి మిసెస్ అండ్ మిస్టర్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. దీన్ని వనితా విజయకుమార్ వారసురాలు జోవిక నిర్మించడం విశేషం. బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొని పాపులర్ అయిన ఈమె నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. వనిత ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై ఈమె నిర్మించిన ఈ చిత్రంలో రాబర్ట్ కథానాయకుడిగా నటించారు. కిరణ్ రాథోడ్, షకీలా ఆర్తిగణేష్, పవర్ స్టార్ శ్రీనివాసన్, ఫాతిమాబాబు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ దేవా సంగీతాన్ని, రాజాపాండి చాయాగ్రహణం అందించారు. పెళ్లి అయినన 40 ఏళ్ల సీ్త్ర సమాజంలో ఎదుర్కొనే సమస్యల సమహారమే ఈ చిత్ర కథ. ఆమెకు తన భర్త ఎలా అండగా నిలిచారు అనే పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన మిసెస్ అండ్ మిస్టర్ షూటింగ్ అధిక భాగం దుబాయ్, థాయిలాండ్లో జరుపుకోవడం విశేషం. ఈ చిత్రం జూలై 4న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు వనిత, నిర్మాత జోవిక మంగళవారం నటుడు రజనీకాంత్ను ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మిసెస్ అండ్ మిస్టర్ చిత్ర విడుదల తేదీ పోస్టర్లు ఆవిష్కరించారు.
50 షేడ్స్ ఆఫ్ సాయిపల్లవి

మిసెస్ అండ్ మిస్టర్ పోస్టర్ల ఆవిష్కరణ