
ఆహార భద్రతపై సెమినార్
తిరువళ్లూరు: అంతర్జాతీయ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా తిరువళ్లూరు జిల్లా కొడువేళిలోని ఫుడ్ అండ్ డెయిరీ టెక్నాలజీ కళశాలలో ప్రపంచ ఆహారభద్రత దినోత్సవం సెమినార్ను నిర్వహించారు. సెమినర్ను రాష్ట్ర ప్రభుత్వ ఆహారభద్రత ఔషధ నియంత్రణ విభాగం కమిషనర్ లాల్వేన్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆహార ఉత్పత్తి ప్రారంభం నుంచి వినియోగదారునికి చేరే వరకు ఆహార ఉత్పత్తులను ఎలా నిర్వహించాలన్న అంశంపై అవగాహన కల్పించారు. పాలు, మాంసం ఇతర ఉత్పత్తులను సురక్షితంగా ఎలా నిల్వ ఉంచాలో అనే అంశంపై అవగాహన అవసరమన్నారు. దీంతోపాటు పాలు ఆధారిత ఆహారాన్ని పరిశుభ్రంగా అందిచడంతో పాటు ఆహార సంబంధిత వ్యాధుల నివారణ చర్యలపై సైతం సెమినార్లో మాట్లాడారు. విద్యార్థులకు ఆహారంలో కల్తీని గుర్తించే పరీక్ష పద్ధతులను ఆయన వివరించారు. ఈ సెమినార్లో ప్రిన్సిపల్ కుమరవేలు, తమిళనాడు వెటర్నరీ సైన్సు వర్సిటీ వైస్ చాన్స్లర్ నరేంద్రబాబు, జిల్లా ఆహారభద్రతా అధికారి కదిరవన్, ఇండియన్ బెయిరీ అసోసియేషన్ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కన్నన్, ప్రొఫెసర్ పుహళేంది, జీఎం శివకుమార్ పాల్గొన్నారు.