
దివ్యాంగులకు వాహనాల పంపిణీ
తిరువళ్లూరు: నియోజకవర్గంలో అర్హులైన 16 మంది దివ్యాంగులకు పెట్రోల్ వాహనాలను స్థానిక ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ మంగళవారం ఉదయం అందజేశారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని దివ్యాంగులను ఎంపిక చేసి అర్హులైన వారికి పెట్రోల్ వాహనాలను అందజేస్తున్న విష యం తెలిసిందే. ఇందులోభాగంగా తిరువళ్లూరు నియోజకవర్గంలోని అర్హుల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. వారిలో అర్హులుగా 16 మందిని ఎంపిక చేసి రూ.16.28 లక్షల విలువ చేసే వాహనాలను ఎమ్మెల్యే, దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి శ్రీనివాసన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేంద్రన్ మాట్లాడుతూ డీఎంకే హయాంలో మాత్రమే దివ్యాంగులు, హిజ్రాలకు ప్రత్యేక గుర్తింపుతోపాటు ప్రోత్సాహకాలను అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు. లబ్ధిదారులు వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీఎంకే యూనియన్ కార్యదర్శులు గూలూరు రాజేంద్రన్, మహాలింగం, కొండంజేరి రమేష్, జిల్లా ఆర్గనైజర్ వీఎస్ నేతాజీ, యువజన విభాగం ఉపకార్యదర్శి మోతీలాల్, ఎన్ఆర్ఐ వింగ్ కార్యదర్శి జయకృష్ణ, యూనియన్ ఉప కార్యదర్శి కాంచీపాడి శరవణన్ తదితరులు పాల్గొన్నారు.