
కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్టు
తిరుత్తణి: ప్రేమ వివాహం చేసిన వ్యక్తి ఇంట్లో చొ రబడిన కిడ్నాపర్లు ఓ బాలుడి కిడ్నాప్ సంఘటనకు సంబంధించి ముగ్గురిని తిరువలంగాడు పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. తిరువలంగాడు సమీపం కలాంపాక్కం గ్రామానికి చెందిన యువరాజు అనే వ్యక్తి కుమారుడు ధను ష్(23) చైన్నెలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా డు. అతను ఇన్స్ట్రాగామ్ ద్వారా తేనికి చెందిన విజ యశ్రీ (21) అనే యువతిని ప్రేమించి, గత నెల 15 వ తేదీన కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నా డు. యువతి కుటుంబం పలుకుబడి ఉన్న కుటుంబం కావడంతో నూతన వధూవరులు ప్రాణ భ యంతో ఎవరి కంటా పడకుండా జీవిస్తున్నారు. వి షయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు మూడు రోజుల కిందట కలాంబాకంలోని ధనుష్ ఇంటికి వెళ్లి ఇంట్లోని అతని తమ్ముడు ఇంద్రచంద్(16) అనే బాలుడిని కిడ్నాప్ చేసి, తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఇంద్రచంద్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాపర్లు బాలుడిని తీసుకొచ్చి వారి ఇంట్లో వదిలిపెట్టి వెళ్లారు. బాలు డిని కిడ్నాప్నకు సంబంధించి తిరువలంగాడు పో లీసులు కేసు నమోదు చేసి, తేనికి చెందిన వనరాజ(51),మణికండన్(44), గణేశన్ (47)ను అరెస్టు చేశారు.