కేసరి పాఠశాలకు ఐదు స్మార్ట్‌ బోర్డులు | - | Sakshi
Sakshi News home page

కేసరి పాఠశాలకు ఐదు స్మార్ట్‌ బోర్డులు

Jun 10 2025 7:10 AM | Updated on Jun 10 2025 7:10 AM

కేసరి పాఠశాలకు ఐదు స్మార్ట్‌ బోర్డులు

కేసరి పాఠశాలకు ఐదు స్మార్ట్‌ బోర్డులు

కొరుక్కుపేట: చైన్నె మైలాపూర్‌లో ఉన్న కేసరి మహోన్నత పాఠశాలకు రోటరీ క్లబ్‌ ఆఫ్‌ గిండి సహకారంతో ఐదు స్మార్ట్‌ బోర్డులను విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రోటేరియన్‌ కమిటీ సభ్యులు ఆర్‌.శ్రీరామన్‌ సంధానకర్తగా వ్యవహరించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ గాయకుడు కలైమామని ఉన్నికృష్ణన్‌ పాల్గొని స్మార్ట్‌ బోర్డులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ప్రయోజకులు కావాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్‌ రాధాకృష్ణన్‌, సెక్రటరీ కేఎస్‌వి ప్రసాద్‌, ప్రధానోపాధ్యాయిని గీతాంజలి, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో ఘనంగా జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement