
రేషన్ దుకాణానికి భూమిపూజ
తిరుత్తణి: తిరుత్తణి యూనియన్ మద్దూరులో అన్నా గ్రామ మరుమలర్చి పథకం ద్వారా రూ.13.30 లక్షల వ్యయంతో రేషన్ దుకాణం నూతన భవనం నిర్మాణ పనులకు సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఇందులో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని, రేషన్ దుకాణం భవనం పనులను ప్రారంభించారు. గ్రామీణుల కోరిక మేరకు రేషన్ దుకాణానికి నూతన భవనం నిర్మించేందుకు వీలుగా నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు గ్రామీణులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంజినీరు ధర్మేష్, డీఎంకే మండల కార్యదర్శులు కృష్ణన్, విజయకుమార్, మీసై వెంకటేశన్ తదితరులు పాల్గొన్నారు.