క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jun 10 2025 3:38 AM | Updated on Jun 10 2025 3:38 AM

క్లుప

క్లుప్తంగా

వేడుకగా గరుడ సేవ

తిరుత్తణి: తిరుత్తణి పట్టణ వీధుల్లో శ్రీవిజయరాఘవ పెరుమాళ్‌ గరుడ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. తిరుత్తణి పట్టణంలో కిరాణా వ్యాపారుల సంఘం, గరుడ సేవ ఉత్సవ క మిటీ సంయుక్తంగా ప్రతి ఏటా శ్రీవిజయరాఘవ పెరుమాళ్‌ గరుడ సేవ వేడుకలు నిర్వహించడం పరిపాటి. ఆ ప్రకారం సోమవారం ఉద యం నంది నదీతీరంలోని శ్రీవిజయరాఘవ పెరుమాళ్‌ ఆలయంలో మూలవర్లకు ప్రత్యేక అభిషేక పూజలు చేపట్టి పుష్పాలంకరణలో మహాదీపారాధన చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 8 గంటలకు ఉత్సవర్ల శ్రీవిజయరాఘవ పెరుమాళ్‌ను ఆభరణాలు పుష్పాలతో అలంకరించి, గరుడ వాహనంపై కొలువుదీర్చి పట్టణవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామికి కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి దర్శించుకున్నారు. సాయంత్రం స్వామివారు బస్టాండు సమీపంలోని సుందర వినాయకుడి ఆలయంలో కొలువుదీరి, అభిషేక పూజలు అందుకున్నారు. రాత్రి స్వామి వారు ఆలయానికి బయల్దేరారు.

నా అనుమతి

తీసుకోవడం లేదు

తమిళసినిమా: గీత రచయిత వైరముత్తు సంగీత దర్శకుడు ఇళయరాజా మాదిరి మారుతున్నారా? అంటే ఈయన తా జాగా తన ఎక్స్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలను చూస్తే అవునననే అనిపిస్తోంది. ఇళయరాజా తన పాటలను తన అనుమతి లేకుండా ఎవరైనా పాడితే వారిపై కేసులు వేస్తుండం తెలిసిందే. అలాగే గీత రచయితగా పేరు గాంచిన వైరముత్తు తాజాగా దర్శక నిర్మాతలపై ఆరోపణలు ఎక్కు పెట్టారు. ఈయన తన ఎక్స్‌ మీడియాలో పేర్కొంటూ తన పాటల్లోని పల్లవిలను, చరణాలను పలువురు సినిమా టైటిల్‌గా వాడుకుంటున్నారన్నారు. అలా ఇప్పటికి ఒకటా రెండా అనేక పాటల్లోని పల్లవులను చిత్రాలకు టైటిల్‌గా వాడుకున్నారన్నారు. అలా పొన్‌మాలై పొళుదు, కన్‌ సివందాల్‌ మణ్‌ సివక్కుమ్‌, ఇళయ నిలా, ఊరతెరింజికిట్టేన్‌, పణివిళుమ్‌ మలర్‌వనం, వెళ్‌లైపురా ఒండ్రు, పూవే పూచూడవా, ఈరమాన రోజావే, నిలావందాన్‌ కై యిల్‌ పుడిచ్చేన్‌, మౌనరాగం, మిన్సార కన్నా, కన్నాలనే, ఎన్నవళే, ఉయిరే, సండక్కోళి, పూవెల్లామ్‌ కేట్టుప్పార్‌ ఇలా అనేకం తన పాటల్లోని పల్లవులను, చరణాలను చిత్ర టైటిల్‌గా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకు తన అనుమతి తీసుకోవడం నాగరికం కాదా? అని ప్రశ్నించారు. కనీస మర్యాద కోసం అయినా అడగాలిగా అని అన్నారు. తానేమైనా వారిని పట్టి పీడిస్తున్నానా? కనిపించిన చోటల్లా అడుగుతున్నానా? ఇది సమాజంలో అందరికీ సొంతం అని వదిలేస్తున్నానని అన్నారు. ఆయన చేసిన ట్వీట్‌ సినీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

మయోపియా నియంత్రణ లక్ష్యంగా ఒప్పందాలు

సాక్షి, చైన్నె: మెనికాన్‌, డాక్టర్‌ అగర్వాల్స్‌ ఐ హాస్పిటల్‌ మధ్య కటింగ్‌–ఎడ్జ్‌ కాంటాక్ట్‌ లెన్స్‌లతో మయోపియా నియంత్రణ లక్ష్యంగా ఒప్పందాలు జరిగాయి. ఈ అవగాహన ఒప్పందం మయోపియా నియంత్రణ చికిత్సను అభివృద్ధి చేయడానికి, ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి ప్రయత్నాలు, నేత్ర వైద్యులు, ఆప్టోమెట్రిస్టులకు శిక్షణ ఇవ్వడం, చికిత్స గురించి అవగాహన పెంచడం, దేశంలోని ఇతర ప్రాంతాల్లో అనుకూలమైన విస్తరణ ప్రణాళికలకు దోహదకరంగా ఉంటుందని ప్రకటించారు. జపాన్‌ ప్రభుత్వ మద్దతుతో డాక్టర్‌ అగర్వాల్స్‌ ఐ హాస్పిటల్‌ , మెనికాన్‌, భారతదేశంలో దృష్టిని మెరుగుపరచడానికి రాత్రిపూట ధరించే ఆర్థో కెరాటాలజీ లెనన్స్‌ అయిన మెనికాన్‌ బ్లూమ్‌ నైట్‌ ఉపయోగించి క్లినికల్‌ అధ్యయనాలను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ అధ్యయనం పిల్లలకు ఆర్థోకెరాటాలజీ లెన్స్‌ సమర్థత, భద్రతను తనిఖీ చేయడం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. ఈ భాగస్వామ్యం గురించి డాక్టర్‌ అగర్వాల్స్‌ ఐ హాస్పిటల్‌ చీఫ్‌ క్లినికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అశ్విన్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ, 2050 నాటికి, మయోపియా కేసులు 50 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసినట్టు వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మెనికాన్‌ సహకారంతో ముందు కెళ్లనున్నామన్నారు. మెనికాన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ హెడ్‌ ఆఫీస్‌ రీజినల్‌ డైరెక్టర్‌ షున్సుకే యమగిషి మాట్లాడుతూ మయోపియాతో పెరుగుతున్న సవాళ్లను అధిగమించేలా డాక్టర్‌ అగర్వాల్స్‌ ఐ హాస్పిటల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని సమస్యను పరిష్కరించడంలో ముందడుగు వేయనన్నామని ప్రకటించారు.

క్లుప్తంగా1
1/2

క్లుప్తంగా

క్లుప్తంగా2
2/2

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement