
● నాలుగు అంశాలకు ప్రాధాన్యత ● రాష్ట్ర ప్రణాళిక సంఘం రూప
సుస్థిర అభివృద్ధి.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం..పరిశోధన.. 2030 నాటికి ఎలక్ట్రానిక్ వాహన ఉత్పత్తిలో తమిళనాడు అగ్రస్థానం లక్ష్యంగా విజన్–2030 డాక్యుమెంట్ సిద్ధమైంది. వ్యవసాయేతర ఉపాధి, నైపుణ్యాల పెంపు తదితర అంశాలతో దీన్ని రూపకల్పన చేశారు. దీన్ని సీఎం స్టాలిన్ ఆవిష్కరించారు.
సాక్షి, చైన్నె : రాష్ట్ర ప్రణాళిక సంఘం నేతృత్వంలో తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ఉపాధి, సుస్థిర అభివృద్ధిని కాంక్షిస్తూ విజన్–2030 డాక్యుమెంట్ సిద్ధమైంది. ఆటో మోటివ్ పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుకు మార్గంగా నాలుగు అంశాలతో ఈ విజన్ రూపకల్పన చేశారు. దీనిని సోమవారం సచివాలయంలో సీఎం ఎంకే స్టాలిన్ విడుదల చేశారు. సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉన్నత స్థాయి సలహా కమిటీ తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రజా సంక్షేమ కార్యమ్రాలను పరిశీలించి, అందుకు తగిన మార్గదర్శకాలను సూచించడమే కాకుండా మూల్యాంకనం చేయడం, సమీక్షించడం, ప్రభుత్వ పాలనలో తలెత్తే కొత్త పరిణామాలను అధ్యయనం చేయడం, అవసరాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకోవడానికి సహకారం అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నివేదికలను కూడా తయారు చేసిన ప్రభుత్వానికి సమర్పిస్తూ వస్తున్నారు. ఆ దిశగా ప్రస్తుతం నాలుగు ముఖ్య అంశాలను పరిగణలోకి తీసుకుని రూపకల్పన చేసిన నివేదికను సచివాలయంలో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ విడుదల చేశారు.
విజన్–2030
స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో విజన్–2030 రూపుదిద్దుకుంది. తమిళనాడు దార్శనికత ‘డాక్యుమెంట్‘గా, తమిళనాడు ప్రభుత్వ ప్రణాళిక, అభివృద్ధి శాఖ తరఫున దీనిని సిద్ధం చేశారు. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఆమోదించిన 2030 అజెండా మేరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కింద సంవత్సరానికి అభివృద్ధి ప్రణాళికను 17 అధ్యాయాలుగా విభజించారు. వివిధ సంక్షేమ, ప్రత్యేక కార్యక్రమాలు, విధాన పరిణామాలను ఇందులో ప్రత్యేకంగా పొందుపరిచారు. తమిళనాడులో ఆటోమోటివ్ (వాహన తయారీ) పరిశ్రమ భవిష్యత్తుకు గైడెన్స్ సంస్థ మార్గదర్శకాలను రూపొందించారు. ఆటో కార్ కంపెనీ నిపుణుల సహకారంతో ‘తమిళనాడులో ఆటోమోటివ్ (వాహన తయారీ) ‘ది ఫ్యూచర్ ఆఫ్ ది సెక్టార్’ అనే నివేదిక ప్రచురించారు. తమిళనాడు ఆటోమోటివ్ తయారీ రంగం అభివృద్ధి, ఎలక్ట్రిక్ హైబ్రిడ్, హైడ్రోజన్, సీఎన్జీ, డీజిల్తో సహా అనేక వాహనాలలో సాంకేతిక పరిజ్ఞానాలను మెరుగుపరచాల్సిన అవశ్యం గురించి, స్థానికీకరణ, ప్రభుత్వ విధాన రూపకల్పనను ప్రోత్సహించడం, బలోపేతం చేయడం లక్ష్యంగా కీలక సిఫారసులు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో 2030 నాటికి దేశంలోనే తమిళనాడు అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడం, రెండు లక్ష మందికి పైగా కార్మికులకు విద్యుత్ వాహన వ్యవస్థలు, బ్యాటరీ టెక్నాలజీ, ఆటోమేషన్లో నైపుణ్యాలను మెరుగు పరిచేలా సూచనలు చేశారు. ఈవీ క్లస్టర్ ఏర్పాటు, రోల్ ఆన్ ..రోల్ ఆఫ్ పోర్టులు, మల్టీమోడల్ రవాణా కేంద్రాలను అప్గ్రేడ్ చేయడం, నైపుణ్య కేంద్రాల ద్వారా పరిశోధన, అభివృద్ధిని విస్తరించడం వంటి సూచనలతో సిఫారసులు చేశారు. 2030 నాటికి తమిళనాడు ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్లు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికను సిద్ధం చేశారు. వాతావరణ అనుకూలతను, ఆవిష్కరణలకు కేంద్రం లక్ష్యంగా ఈ నివేదిక తమిళనాడు ప్రగతికి మార్గం సుగమం చేస్తుందని ప్రకటించారు. తమిళనాడును నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు తీర్చిదిద్దే మార్గంగా గైడెన్స్ తమిళనాడుకు బిజినెస్ స్టాండర్డ్ సహకారంతో ‘‘విజ్ఞాన ఆర్థిక వ్యవస్థ వైపు తమిళనాడు’’ అనే నినాదాన్ని సిద్ధం చేశారు.‘ది పాత్ టు డిజైన్‘ అనే నివేదికను ప్రచురించారు. ఇందులో గ్లోబల్ కాంపిటెన్న్స్ సెంటర్లు , తయారీ రంగం ప్రగతి, భవిష్యత్తుకు మార్గం సాంకేతికత, ఆవిష్కరణ, తయారీ రంగం ఆధారంగా స్థిరమైన అభివృద్ధి, ఎంఎస్ఎంఈల బలోపేతం , ఉద్యోగాల కల్పన, ఆర్థిక స్థిరత్వం వంటి ముఖ్య అంశాల గురించి విశదీకరించారు. ఈ నివేదిక, అందరికీ ప్రయోజనం చేకూర్చే ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్య నిర్వాహక ఉపాధ్యక్షుడు డాక్టర్ జె. జయరంజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, ప్రణాళిక, అభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ మీనా, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి టి.ఉదయచంద్రన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం సభ్య కార్యదర్శి సుధా తదితరులు పాల్గొన్నారు.
న్యూస్రీల్
సమీక్షలతో బిజీ..
అనంతరం జరిగిన కార్యక్రమంలో సచివాలయంలో పలు శాఖల అధికారులతో పథకాల తీరు తెన్నుల గురించి సీఎం స్టాలిన్ సమీక్షించారు. ముందుగా రహదారులు, మైనర్ పోర్టుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న రహదారుల పనులు, పోర్టుల నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర వివరాలను సీఎం ఆరా తీశారు. పనుల వేగం పెంచాలని ఆదేశించారు. అనంతరం సహకార, ఆహార భ భద్రత, వినియోగదారుల సంక్షేమల శాఖ అధికారులతో సమీక్షించారు. అలాగే, అసెంబ్లీలో చేసిన చట్టాలు, విద్యాబోర్డుకు సంబంధించిన అంశాలపై సంబంధిత అధికారులతో సీఎం చర్చించారు. జూలై నుంచి విద్యుత్ చార్జీల వడ్డన అన్న సమాచారాల నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకున్నట్టైంది. గృహాలకు ఈ సారి విద్యుత్ వడ్డనకు ఆస్కారం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమావేశాల్లో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రులు ఏవీ వేలు, పెరియకరుప్పన్, చక్రపాణి, శివశంకర్, తదితరులు పాల్గొన్నారు. చివరగా తమిళ హెరిటేజ్ ఫౌండేషన్ నేతృత్వంలో దక్షిణ కొరియలోని హుంకువర్సిటీ సహకారంతో తమిళ అధ్యయనాలపై రూపొందించిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, దక్షిణ కొరియాకు చెందిన రచయితలు, నిపుణులు, రాయబార కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
కార్మికులుగా..
తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు చేపట్టారు. ఈ అంశంపై అధ్యయనం చేసి తమిళనాడులో అత్యంత వ్యవసాయేతర , పరిమిత వ్యవసాయ పనులు ఉన్న జిల్లాలను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆరు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో వ్యవసాయ పనుల నుంచి, ఇతర రంగాలకు మారడం విస్తృతమైనట్టు వెలుగు చూసింది. నిర్మాణం, తయారీ వంటి రంగాల్లో కార్మికుల సంఖ్య పెరిగిందని, ప్రస్తుతం 75 శాతం కంటే అధికంగా పురుషులు, 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు కార్మికులుగా వ్యవసాయేతర రంగాల్లో ఉన్నట్టు ప్రకటించారు. 15 నుంచి 34 సంవత్సరాల వయస్సు ఉన్న వారు కార్మికులుగా మారి ఉన్నారని, ఇందుకు కారణం అధిక వేతనాలు, స్థిరమైన ఉపాధి అని పేర్కొంటూ, యువత అధికంగా నిర్మాణ, పరిశ్రమల వైపు ఉన్నట్టు, తయారీ రంగంలో మహిళలు అధికంగా ఉన్నట్టు వివరించారు.

● నాలుగు అంశాలకు ప్రాధాన్యత ● రాష్ట్ర ప్రణాళిక సంఘం రూప

● నాలుగు అంశాలకు ప్రాధాన్యత ● రాష్ట్ర ప్రణాళిక సంఘం రూప

● నాలుగు అంశాలకు ప్రాధాన్యత ● రాష్ట్ర ప్రణాళిక సంఘం రూప

● నాలుగు అంశాలకు ప్రాధాన్యత ● రాష్ట్ర ప్రణాళిక సంఘం రూప

● నాలుగు అంశాలకు ప్రాధాన్యత ● రాష్ట్ర ప్రణాళిక సంఘం రూప