ఘనంగా అర్ధనారీశ్వరుడి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా అర్ధనారీశ్వరుడి రథోత్సవం

Jun 10 2025 3:34 AM | Updated on Jun 10 2025 3:34 AM

ఘనంగా

ఘనంగా అర్ధనారీశ్వరుడి రథోత్సవం

సేలం: నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడ్‌లోని అర్ధనారీశ్వరస్వామి వైకాసి విశాఖ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడు ప్ర త్యేక ఉత్సవాల్లో ఒకటైన వైకాసి విశాఖ రథోత్సవాలు ఈ నెల ఒకటో తేదీన ధ్వజారోహణంతో ప్రా రంభమయ్యాయి. కొండ గుడి నుంచి నగరానికి అ ధిరోహించిన అర్ధనారీశ్వరుడు తిరుత్తర వద్దకు వచ్చి భక్తులను అనుగ్రహించే వైకాసి విశాఖ రథోత్సవం 14 రోజుల పాటు వైభవంగా జరగనుంది. తిరుకల్యాణ ఉత్సవం, పరివార సమేతంగా తిరుత్తరాన్ని అధిరోహించే అర్ధనారీశ్వరుడు తొమ్మిదో రో జు వైభవంగా నిర్వహించారు. కైలాసనాథర్‌ ఆల యంలోని సొక్కప్ప ముదలియార్‌ ఆరంగంలో అర్ధనారీశ్వరుడు, సెంగొట్టు వేలవర్ల తిరుకల్యాణ ఉత్సవం, అనంతరం ప్రత్యేక దీపారాధనలు నిర్వహించారు. అంతకుముందు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. తిరుచెంగోడు అర్థనారీశ్వర ఆలయ కార్యనిర్వహణాధికారి రమణికాంతన్‌, తిరుచెంగోడు డిప్యూ టీ సూపరింటెండెంట్‌ కృష్ణన్‌, తిరుచెంగోడు అర్థనారీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్‌ తంగముత్తు, ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు మేసనన్‌అన్పరస , ఉర్‌గౌండర్‌ రాజా, పురపాలక సంఘం సభ్యులు పాల్గొన్నారు. భక్తులకు పసుపు, కుంకుమ, తాడు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

ఘనంగా అర్ధనారీశ్వరుడి రథోత్సవం1
1/3

ఘనంగా అర్ధనారీశ్వరుడి రథోత్సవం

ఘనంగా అర్ధనారీశ్వరుడి రథోత్సవం2
2/3

ఘనంగా అర్ధనారీశ్వరుడి రథోత్సవం

ఘనంగా అర్ధనారీశ్వరుడి రథోత్సవం3
3/3

ఘనంగా అర్ధనారీశ్వరుడి రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement