వైభవంగా శ్రీమన్నిండీశ్వరాలయ మహా కుంభాభిషేకం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీమన్నిండీశ్వరాలయ మహా కుంభాభిషేకం

Jun 10 2025 3:34 AM | Updated on Jun 10 2025 3:34 AM

వైభవం

వైభవంగా శ్రీమన్నిండీశ్వరాలయ మహా కుంభాభిషేకం

వేలూరు: జిల్లాలోని కాట్పాడి తాలుకా తలయారంబట్టు గ్రామంలో ఉన్న శ్రీమంగళనాయగి సమేత శ్రీ మన్నిండీశ్వరాలయ మహా కుంభాభిషేకం సోమవా రం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ధర్మకర్త చంద్రశేఖర్‌ అధ్యక్షతన వేద పండితులు ఆలయంలో యాగశాల పూజలు చేశారు. గణపతి హో మం, గజపూజ, అష్టబంధన పూజలు జరిపారు. అ లాగే ఆలయంలో శ్రీ చండికేశ్వరర్‌, శ్రీ భైరవర్‌, శ్రీ పెరుమాల్‌, శ్రీనవగ్రహాలు, శ్రీ శివనాయన్‌మార్లు వంటి పరిహార మూర్తుల విగ్రహాలను ఉంచి అష్టబంధనం చేశారు. అనంతరం ఆలయంలో స్వామి వారి విగ్రహాన్ని అమర్చి, వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేసి, వివిధ పుణ్యనదుల నుంచి తీసుకొచ్చిన పుణ్యజలాలను ఆలయ రాజ గోపురంపై సంప్రోక్షణ చేసి, హరోంహర నామ స్మరణాల న డుమ మహా కుంభాభిషేక చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. కాట్పాడి యూనియన్‌ వైస్‌చైర్మన్‌ శరవణన్‌, సర్పంచ్‌ రాజేష్‌కన్నన్‌ అమ్ము, ఏడో వార్డు సభ్యులు రాజకుమారి, మాజీ వార్డు సభ్యులు ఎస్‌ రమేష్‌ పాల్గొన్నారు. ఆలయంలో సాయంత్రం సంగీత విభావరి నిర్వహించారు.

వైభవంగా శ్రీమన్నిండీశ్వరాలయ మహా కుంభాభిషేకం 1
1/1

వైభవంగా శ్రీమన్నిండీశ్వరాలయ మహా కుంభాభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement