
దేశసేవకు అంకితం కావాలి
కొరుక్కుపేట: దేవసేవకు అంకితం కావాలని వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ శిక్షణ పూర్తి చేసిన పైలెట్లకు పిలుపునిచ్చారు. భారత నావికాదళానికి చెందిన అరక్కోణం హెలికాప్టర్ శిక్షణ పాఠశాల నుంచి 18 మంది పైలట్లు పట్టభద్రులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం అరక్కోణంలోని ఐఎన్ఎస్ రాజాలినావల్ బేస్లో గ్రాడ్యుయేషన్ పరేడ్లో మొత్తం 18 మంది క్యాడెట్లు విన్యాసాలతో ఆకట్టుకున్నారు. వీరంతా నేవీలో హెలికాప్టర్ పైలట్లుగా చేరారు. వారిలో సబ్ లెఫ్టినెంట్ సిద్ధి హేమంత్ దూబే అనే మహిళా అధికారి ఉన్నారు. ఐఎన్ఎస్ రాజాలిలోని ఇండియన్ నావల్ ఎయిర్ స్క్వాడ్రన్ 561 కింద పనిచేసే హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్లో 22 వారాల ఫ్లయింగ్, గ్రౌండ్ శిక్షణ పూర్తి చేసిన తరువాత వారు నేవీలో పైలట్లుగా చేరారు. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన తూర్పు ప్రాంత కమాండర్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ పాల్గొని, హెలికాప్టర్ పైలట్లుకు గోల్డెన్ వింగ్స్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ మాట్లాడుతూ 18 మంది యువ పైలట్లు భారత నావికాదళంలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఆకట్టుకున్న పైలట్లు
గ్రాడ్యుయేషన్ పరేడ్