గ్రీన్‌ రన్‌కు అనూహ్య స్పందన | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ రన్‌కు అనూహ్య స్పందన

Jun 9 2025 7:01 AM | Updated on Jun 9 2025 7:01 AM

గ్రీన్‌ రన్‌కు అనూహ్య స్పందన

గ్రీన్‌ రన్‌కు అనూహ్య స్పందన

కొరుక్కుపేట: పర్యావరణాన్ని ప్రోత్సహించే విధంగా పర్య జియో ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్‌ రన్‌–2025కు అనూహ్య స్పందన లభించింది. చైన్నెలోని నందనంలోని వైఎంసీఏ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమానికి 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లుగా చేపట్టిన గ్రీన్‌ రన్‌ను మద్రాస్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రాసెసింగ్‌ జోన్‌న్‌లోని ఐఆర్‌టీఎస్‌ డిప్యూటీ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌, ఎం.అశ్విన్‌, నటి పార్వతినాయర్‌ పాల్గొని జెండా ఊపి గ్రీన్‌రన్‌ను ప్రారంభించారు. చైన్నెలోని ఐటీ బినామీ నిషేధ యూనిట్‌ డిప్యూటీ కమిషనర్‌ అమ్ము, చైన్నెలోని గెయిల్‌ లిమిటెడ్‌ జోనల్‌ జనరల్‌ మేనేజర్‌ కె.అశోక్‌, వైఎంసీఏ జనరల్‌ సెక్రెటరీ పి.ఆసిర్‌ పాండియన్‌, అన్వేషి ఫౌండేషన్‌ నిర్వాహకులు స్వామి ప్రేమ్‌ అన్వేషిజీ, రంబోల్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ గార్గ్‌ పాల్గొని పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. ముందుగా జియో ఇండియా ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు ప్రియా జెమీమా మాట్లాడుతూ ప్రతీ ఏడాది అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్‌ రన్‌ ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రన్‌లో పాల్గొన్న వారందరికీ మెడల్స్‌తో పాటు మొక్కలను పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement