క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jun 9 2025 7:01 AM | Updated on Jun 9 2025 7:01 AM

క్లుప

క్లుప్తంగా

భార్య కాపురానికి

రాలేదని ఆత్మహత్య

పళ్లిపట్టు: భార్య కాపురానికి రాలేదనే ఆవేదనతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పళ్లిపట్టు ప్రాంతంలో చోటుచేసుకుంది. పళ్లిపట్టు పోలీసుల కథనం మేరకు కొళత్తూరు దళితవాడకు చెందిన చిట్టిబాబు కుమారుడు సాము(23) పండ్లు వ్యాపారం చేసుకుని జీవిస్తున్నాడు. ఇతను కలైవాణి అనే యువతిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. దంతపులకు పాప, అబ్బాయి సహా ఇద్దరు చిన్న పిల్లలున్నారు. దంపతుల మధ్య చోటుచేసుకున్న విభేదాలతో రెండేళ్ల నుంచి భర్త నుంచి విడిపోయిన కలైవాణి పుట్టింట్లో ఉంటోంది. పలుసార్లు కాపురం రావాలని భార్యను సాము వేడుకున్నట్లు, అయితే అతని భార్య అంగీకరించకపోవడంతో ఆవేదనకు గురయ్యాడు. సాము శుక్రవారం రాత్రి ఇంట్లోని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం మేరకు పళ్లిపట్టు పోలీసులు మృతదేహం చేపట్టి పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుక్క దాడిలో

చిన్నారికి గాయాలు

తిరువొత్తియూరు: హొసూర్‌ సమీపంలోని తన ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని వీధి కుక్క కరిచింది. బాలుడు తీవ్ర గాయాలతో ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్నాడు. కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన ప్రతాప్‌ భార్య నందిని. వీరికి అర్జున్‌ అనే 3 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. వీరు హొసూర్‌ సమీపంలోని నాగొండపల్లిలో జరుగుతున్న ఆలయ ఉత్సవంలో పాల్గొనడానికి బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బాలుడు ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు. ఆ దారిలో వచ్చిన ఒక వీధి కుక్క బాలుడిని కరిచింది. బాలుడు కేకలు వేయడంతో ఇది విన్న పొరుగువారు పరిగెత్తుకుంటూ వచ్చి, వీధి కుక్కను తరిమివేశారు. బాలుడిని రక్షించారు. కుక్క దాడిలో బాలుడు అర్జున్‌ తల, చేతులు, కాళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు, బంధువులు చికిత్స కోసం హోసూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడికి అక్కడ 10 కుట్లు పడ్డాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని వీధికుక్క కరిచి, గాయాలు చేసిన సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. వీధికుక్కలను నియంత్రించడానికి కార్పొరేషన్‌ పరిపాలన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేశారు.

సర్వ దర్శనానికి

24 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 88,257 మంది స్వామివారిని దర్శించుకోగా 45,068 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.68 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

వైభవం..

సాంస్కృతిక సంబరం

చంద్రగిరి: తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. వారాంతపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం చైన్నెకి చెందిన శక్తిలయ నాట్యపల్లి ఆధ్వర్యంలో నాట్యాచార్యులు సతియ ఆనంద రెడ్డి పర్యవేక్షణలో శాసీ్త్రయ నృత్యాలను ప్రదర్శించారు. వారి అభినయానికి మంత్రముగ్ధులైన ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందనలు తెలిపారు. అనంతరం ఏఓ సుధాకర్‌ కళాకారులను సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.

పళ్లికొండేశ్వర స్వామికి ప్రదోష పూజలు

నాగలాపురం: మండలంలోని సురుటుపళ్లి గ్రామంలో ప్రదోష క్షేత్రంగా బాసిల్లుతున్న సర్వమంగళ సమేత పళ్లికొండేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ప్రదోష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేశన్‌ గురుక్కల్‌ ఆలయంలోని నందీశ్వర స్వామికి వాల్మికీశ్వర స్వామికి ఏకకాలంలో పూజలు నిర్వహించారు.

క్లుప్తంగా1
1/2

క్లుప్తంగా

క్లుప్తంగా2
2/2

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement