
ముగిసిన వేసవి వాలీబాల్ శిబిరం
తిరుత్తణి: వేసవి వాలీబాల్ పోటీలు నిర్వహించిన నిర్వాహకులు సర్టిఫికెట్లతో సత్కరించారు. తిరువళ్లూరు జిల్లా వాలీబాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తిరుత్తణి డాక్టర్ రాధాకృష్ణన్ ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాల క్రీడా మైదానంలో నెల రోజులపాటు వేసవి వాలీబాల్ శిక్షణా శిబిరం నిర్వహించారు. యువకులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్న శిబిరంలో వాలీబాల్ కోచ్ హేమనాథన్ ఆధ్వర్యంలో యువకులు, విద్యార్థులకు శిక్షణ తరగతులు చేపట్టారు. ఆదివారం శిక్షణ ముగింపోత్సవం నిర్వహించారు. ఇందులో జిల్లా వాలీబాల్ ఫెడరేషన్ కార్యదర్శి కుప్పుస్వామి పాల్గొని శిక్షణ పూర్తిచేసుకున్న యువకులు, విద్యార్థులకు సర్టిఫికెట్లతో సత్కరించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణన్ తనవంతుగా శిక్షణ పొందిన యువకులు, విద్యార్థులకు యూనిఫాం అందజేశారు. బీఎంసీ క్లబ్ అధ్యక్షుడు సుల్తాన్ పాల్గొన్నారు.