పట్టణాభివృద్ధికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

పట్టణాభివృద్ధికి పెద్దపీట

Jun 9 2025 6:59 AM | Updated on Jun 9 2025 6:59 AM

పట్టణ

పట్టణాభివృద్ధికి పెద్దపీట

తాగునీటికి ప్రాధాన్యం

ప్రభుత్వం నివేదిక

పారిశుధ్య కార్మికులకు తోడ్పాటు

సాక్షి,చైన్నె: పట్టణాభివృద్ధికి పెద్ద పీట వేసే విధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉందని సీఎం ఎంకే స్టాలిన్‌ అన్నారు. 4 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు, 49 పట్టణ పంచాయతీలు, 10,565 గ్రామాల్లో రూ.9011.45 కోట్ల విలువైన 71 తాగునీటి ప్రాజెక్టులను 121.37 లక్షల మందికి ప్రయోజనం కలిగించే విధంగా అమలు చేశామని ప్రకటించారు. నాలుగు సంవత్సరాల డీఎంకే ప్రభుత్వ హయాంలో అమలు చేసిన తాగునీరు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదికను సీఎం స్టాలిన్‌ ఆదేశాల మేరకు ఆదివారం సమచారశాఖ ప్రకటించింది. ఈమేరకు 3 కార్పొరేషన్లు, 8 మున్సిపాలిటీల్లో రూ.1,777 కోట్లతో 6 టౌన్‌షప్‌లు, 17 భూగర్భ మురుగునీటిపారుదల ప్రాజెక్టుల గురించి సైతం వివరించారు. కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో తాగునీటి పనులు, పార్కుల అభివృద్ధికి రూ.6,655.80 కోట్లు వెచ్చించినట్టు ప్రకటించారు. పోరూర్‌లో రూ. 4,276.44 కోట్లతో అతిపెద్ద సముద్రపు నీటి డీశాలినేషన్‌ ప్లాంట్‌ పనులు జరుగుతున్నాయని, మరో 14 కార్పొరేషన్లలో రూ.3,360 కోట్లతో భూగర్భ మురుగునీటి పారుదల ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామని వివరించారు. రూ.1,120.29 కోట్లతో మున్సిపాలిటీలు పట్టణ పంచాయతీల్లో 99 కొత్త బస్టాండ్ల పనులు పూర్తిచేశామని వివరించారు.

తాగునీటి సరఫరా మెరుగుదల

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీలలో 1,652 కారుణ్య నియామకాలు ఇప్పటి వరకు జరిగినట్టు వివరించారు. కలైంజ్ఞర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుల మేరకు నగర పంచాయతీలకు రూ.5 వేల కోట్లు కేటాయించామని, అలాగే మనకు మనం పథకం మేరకు రూ.582 కోట్లు మాత్రమే కేటాయించామని గుర్తుచేశారు. రూ. 6,655.80 కోట్ల విలువైన అభివృద్ధి పనులు అమృత్‌ భారత్‌ పథకం కింద జరుగుతున్నాయని గుర్తుచేస్తూ , దశల వారీగా రూ.6,655.80 కోట్ల అంచనా వ్యయంతో 446 భూగర్భ మురుగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టు పనులు, పార్కు అభివృద్ధి, నీటి వనరుల పునర్నిర్మాణం, నగరాల సుందరీకరణ వంటి పనులు విస్తృతం చేసినట్టు వివరించారు.

అందరికీ గృహాలు..

అందరికీ గృహ నిర్మాణ పథకం కింద 14,669 గృహాలను పట్టణాలలో నిర్మించామని వివరించారు. ఈ సందర్భంగా సముద్రపు నీటి శుద్ధీకరణ పథకం గురించి వివరిస్తూ పోరూర్‌లో మరో కొత్త ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయ న్నారు. తమిళనాడులోని పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ప్రజలందరికీ అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను సృష్టించడంలో, మార్గదర్శక సూత్రాలు అనుసరించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని వివరించారు. పారిశుధ్య కార్మికులను బలోపేతం చేసే విధంగా, వారిని యజమానులుగా మార్చే దిశగా కొత్త పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వారి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలతోపాటు వారికి తోడ్పాటుగా నిలుస్తున్నామని వివరించారు.

కొత్త బస్టాండ్‌లు

కార్పొరేషన్‌, మున్సిపాలిటీలలో 28 కొత్త బస్టాండ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు వివరించారు. తిరుచ్చి, నామక్కల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లకు రూ.968.08కోట్లతో పనులకు ఆమోదించామన్నారు.

పట్టణాభివృద్ధికి పెద్దపీట1
1/1

పట్టణాభివృద్ధికి పెద్దపీట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement