
● కష్టపడి పనిచేయండి ● పార్టీ శ్రేణులకు అమిత్షా పిలుపు
సాక్షి, చైన్నె : 2026లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తమిళనాడులో గెలుపు లక్ష్యం అని, అధికార పగ్గాలు చేపట్టే దిశగా ప్రతిఒక్కరూ మరింత గా శ్రమించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. మదురై పర్యటనకు వచ్చిన అమిత్షా ఆదివారం ఉదయం మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలను అమిత్షా నిర్వహించారు. ఆయనకు అన్న ప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఈసందర్భంగా మదురై ఆధీనం జ్ఞాన సంబంధం దేశిక పరామాచార్యాస్వామి కాషాయం శాలువా కప్పి అమిత్షాను సత్కరించారు. అనంతరం తమిళనాడు బీజేపీ సెంట్రల్ కమిటీతో అమిత్షా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షుడు అన్నామలై, సీనియర్ నేతలు పొన్రాధాకృష్ణన్, హెచ్ రాజ, తమిళిసై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్తోపాటు నేతలు హాజరయ్యారు. పార్టీ బలోపేతం దిశగా పలు సూచనలు అమిత్ షా ఇచ్చారు. బూత్ కమిటీ నుంచి రాష్ట్ర స్థాయి కమిటీ వరకు చేయాల్సిన పనులు, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చేపట్టాల్సి కార్యక్రమాలను గురించి వివరించారు. 2026 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. బీజేిపీకి పట్టున్న నియోజకవర్గాలను గురించి ఈసందర్భంగా ఆయన దృష్టికి సమగ్ర వివరాలను నేతలు తీసుకెళ్లారు. ఈ నియోజకవర్గాల మీద మరింతగా దృష్టి పెట్టాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు.

● కష్టపడి పనిచేయండి ● పార్టీ శ్రేణులకు అమిత్షా పిలుపు

● కష్టపడి పనిచేయండి ● పార్టీ శ్రేణులకు అమిత్షా పిలుపు