ఎస్పీ బాలును మరువలేం | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ బాలును మరువలేం

Jun 9 2025 6:59 AM | Updated on Jun 9 2025 6:59 AM

ఎస్పీ బాలును మరువలేం

ఎస్పీ బాలును మరువలేం

కొరుక్కుపేట: సంగీతం ఉన్నంత వరకు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంను మరువలేమని సినీ నటుడు, ఫ్లూటిస్టు అప్పారావుసతీష్‌ కొనియాడారు. ఈమేరకు ఎస్సీబీ 79వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్‌ ఎస్పీ బాలసుబ్రమణ్య కల్చరల్‌ ట్రస్ట్‌ భాగమైన డాక్టర్‌ ఎస్పీబీ మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ ఆధ్వర్యంలో సింగర్స్‌ మీట్‌ పేరుతో ఎస్సీబీ పాటలతో ప్రత్యేక సంగీత విభావరిని ఆదివారం సాయంత్రం నిర్వహించారు .ట్రస్ట్‌ వ్యవస్థాపకులు కేఎం కొండయ్య టీటీఆర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి గాయనీ, గాయకులు పెద్దసంఖ్యలో పాల్గొని బాలు పాడిన తెలుగు, తమిళ పాటలను ఆలపించి అందరినీ అలరించారు. ప్లూటిస్టు అప్పారావు సతీష్‌, అమృత శ్రీ వర్షిణి సేవా సంస్థ నిర్వాహకులు, గాయకులు స్వరశ్రీ పి కొండలరావు పాల్గొని ముందుగా ఎస్పీ బాలు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ వ్యవస్థాపకులు కేఎం కొండయ్య టీటీఆర్‌, సెక్రటరీ వైఏ విలియం, కోశాధికారి కె బాలాజీరావు కలిసి ఎస్పీబాలు పాటలతో వీనులవిందు చేశారు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన గాయనీ గాయకులు కృష్ణవేణి , తమిళ్‌సెల్వి, వరదరాజన్‌, శరవణన్‌, లక్ష్మీణ్‌, తనిగై, మదన్‌, యువరాజ్‌లను బెస్ట్‌ సింగర్‌ అవార్డులతో ఘనంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement