
నమ్మాళ్వార్ అవార్దుల ప్రదానం
సాక్షి, చైన్నె: వ్యవసాయంలో అద్భుత పరిశోధనలకుగాను ఉత్తమ రైతులకు నమ్మాళ్వార్ అవార్డులను ప్రదానం చేశారు. గవర్నర్ ఆర్ఎన్.రవి ఈ అవార్డులను ఉత్తమ రైతులకు అందజేశారు. పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఆదివారం స్థానికంగా ఉత్తమ రైతులకు సత్కార వేడుక జరిగింది. హరిత విప్లవం దిశగా రైతులు సహజ పద్ధతులను అనుసరిస్తూ సాగు విస్తీర్ణం పెంపునకు కృషిచేస్తుండడాన్ని పరిగణించి ఉత్తమ రైతులకు అవార్డుల ప్రదానోత్సవం చేశారు. ఇందులో గవర్నర్ పాల్గొని ఉత్తమ అవార్డులను అందజేశారు. ఈసందర్భంగా గవర్నర్ ఆర్ఎన్.రవి మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక అని పేర్కొంటూ, వారి సేవలు, త్యాగాలను ఎవ్వరూ మరచిపోకూడదన్నారు. వ్యవసాయ అభ్యున్నతికి నమ్మాళ్వార్ అందించిన కృషిని గుర్తుచేస్తూ, ప్రస్తుతం ఆ దిశగా పయనిస్తున్న రైతులకు ఆయన పేరిట అవార్డులను ప్రదానం చేయడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.