● మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు ● ఖుర్బానీలు..పేదలకు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

● మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు ● ఖుర్బానీలు..పేదలకు పంపిణీ

Jun 8 2025 1:05 AM | Updated on Jun 8 2025 1:05 AM

● మసీ

● మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు ● ఖుర్బానీలు..ప

సాక్షి, చైన్నె: త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ పండుగను శనివారం రాష్ట్రంలోని ముస్లింలు భక్తిద్ధలతో జరుపుకున్నారు. మసీదులు, ఈద్గా మైదానాలలో, సముద్ర తీరాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇళ్ల వద్ద ఖుర్బాని ఇచ్చారు. ఈ మాంసాన్ని మూడు భాగాలుగా చేసిన పేదలు, బంధుమిత్రులకు పంచి పెట్టారు.

భక్తి భావాన్ని చాటే రంజాన్‌ పర్వదినం తర్వాత అత్యంత ప్రధాన పండుగ బక్రీద్‌ను ముస్లింలు జరుపుకుంటారు. త్యాగ నిరతిని చాటే ఈ పండుగను ఈదుల్‌ జుహా, ఈదుజ్జుహా అని కూడా పిలుస్తారు. ఈ పండుగ వెనుక త్యాగాన్ని చాటే కథ ఉందని చెప్పవచ్చు. ఆ మేరకు దైవ ప్రవక్తల్లో ఒకరైన హజ్రత్‌ ఇబ్రహీం తాను నిద్రిస్తున్న సమయంలో వచ్చిన కలను సాకారం చేసుకునేందుకు నిర్ణయిస్తారు. ఆ కలను అల్లా ఆదేశంగా భావించిన ఆయన తన తనయుడు ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధపడతారు. బలి ఇచ్చే సమయంలో వీరి భక్తికి మెచ్చిన అల్లా ఇస్మాయిల్‌ స్థానంలో ఓ గొర్రెను ఉంచుతారు. అప్పటి నుంచి వీరి త్యాగాన్ని స్మరిస్తూ ముస్లింలు బక్రీద్‌ పండగను జరుపుకుంటూ వస్తున్నారు. అలాగే ఇస్లాం సూచించిన ఐదు సూత్రాల్లో ఒకటైన హజ్‌ యాత్ర కూడా ఈ మాసంలోనే నిర్వహిస్తారు. బక్రీద్‌ పర్వదినాన మక్కాలో నమాజు చేసే అవకాశం దక్కడంతో ఈ ఏడాది రాష్ట్రం నుంచి వేలాది మంది హజ్‌ యాత్రకు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో శనివారం బక్రీద్‌ పర్వదినం కావడంతో రాష్ట్రంలో ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో భక్తిభావం మిన్నంటింది.

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

న్యూస్‌రీల్‌

ప్రత్యేక ప్రార్థనలు..ఖుర్బానీ

బక్రీద్‌ పర్వదినాన ప్రార్థనే కాదు..ఖుర్బానీ ఇవ్వడం ముఖ్యం. హజ్రత్‌ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరిస్తూ ప్రతిఇంటా గొర్రె లేదా ఒంటెను ఖుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ దిశగా శనివారం ఇళ్ల వద్ద ఖుర్బానీ ఇచ్చే కార్యక్రమాలు జరిగాయి. ఖుర్బానీ ఇచ్చిన గొర్రె లేదా ఒంటె మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి, ఒక భాగం తమ కుటుంబానికి, రెండో భాగం బంధుమిత్రులకు, మూడో భాగం పేదలకు పంచి పెట్టారు. విందులతో సందడి చేశారు. ముందుగా ఉదయాన్నే ప్రత్యేక ప్రార్థనలు మసీదులు, ఈద్గా మైదానాలలో జరిగాయి. కొత్త బట్టలను ధరించి తమ ప్రాంతంలోని మసీదులు, ఈద్గా మైదానాలకు ముస్లింలు కుటుంబాలతో కలిసి కదిలారు. అల్లాను సమ్మరిస్తూ ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రదేశాల్లో సందడి వాతావరణం నెలకొంది. జట్లు జట్లుగా మసీదులు, ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనల్లో లీనమయ్యారు. మత గురువులు బక్రీద్‌ పండుగ విశిష్టను వివరిస్తూ ఉపదేశం చేశారు. అందరి చేత ప్రార్థనలు చేయించారు. ప్రార్థనల అనంతరం ఒకరిని మరొకరు ఆలింగనం చేసుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చైన్నె, శివారు జిల్లాలు, మదురై, రామనాథపురం, నాగపట్నం, తిరునల్వేలి, తెన్‌కాశి, జిల్లాల్లో ఉదయం ఎనిమిది, ఎనిమిదిన్నర గంటలకే ప్రార్థనలు ముగించారు. మరికొన్ని చోట్ల ఎనిమిదిన్నర, తొమ్మిది, తొమ్మిదిన్నర గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లతో వ్యవహరించారు. నాగూర్‌లో సముద్రతీరంలో ప్రత్యేక ప్రార్థన జరిగింది. పుదుచ్చేరిలో సముద్రతీరంలోని గాంధీ విగ్రహం ఎదురుగా ప్రత్యేక ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. పేద, ధనవంతుడు, అధికారి, రాజకీయ నాయకుడు అన్న భేదాలు లేకుండా అందరూ మసీదులు, ఈద్గా మైదానాలలో ఒకే వరుసలో నిలబడి ప్రత్యేక ప్రార్థనలతో అల్లా కృపను పొందేవిధంగా ముందుకు సాగారు.

● మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు ● ఖుర్బానీలు..ప1
1/2

● మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు ● ఖుర్బానీలు..ప

● మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు ● ఖుర్బానీలు..ప2
2/2

● మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు ● ఖుర్బానీలు..ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement