ఇంజినీరింగ్‌కు 50వేల దరఖాస్తులు అదనం | - | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌కు 50వేల దరఖాస్తులు అదనం

Jun 8 2025 1:05 AM | Updated on Jun 8 2025 1:05 AM

ఇంజినీరింగ్‌కు 50వేల దరఖాస్తులు అదనం

ఇంజినీరింగ్‌కు 50వేల దరఖాస్తులు అదనం

కొరుక్కుపేట: ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా భారీ సంఖ్యలో విద్యార్థులు ఇంజినీరింగ్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌న్‌లైన్‌న్‌లో నమోదు చేసుకున్న వారి సంఖ్య 3 లక్షలు దాటింది. శుక్రవారం దరఖాస్తుల గడువు ముగిసింది. 2,49,883 మంది దరఖాస్తు రుసుము చెల్లించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దరఖాస్తులు సమర్పించడానికి 9వ తేదీ వరకు గడువు ఉన్నందున, 2 వేలకు పైగా అప్‌లోడ్‌ చేయడానికి అవకాశం ఉంది. ఈ ఏడాది, గత సంవత్సరం కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి, 50వేల మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం 2 లక్షల 6 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గత 6–7 సంవత్సరాల తర్వాత ఇంజినీరింగ్‌ కోర్సులపై ఆసక్తి పెరిగింది

అనుమానాస్పద స్థితిలో జాలరి మృతి

అన్నానగర్‌: సముద్రంలో అనుమానాస్పద స్థితిలో ఓ జాలరి మృతిచెందాడు. తూత్తుకుడిలోని థ్రెస్‌పురానికి చెందిన మత్స్యకారుడు పరిమళం (47). ఇతను తీరం నుంచి జగన్‌న్‌కు చెందిన పడవలో మరో ఏడుగురితో కలిసి సముద్రంలోకి వెళ్లాడు. శనివారం ఉదయం సముద్రం మధ్యలో పరిమళం, అతని తోటి మత్స్యకారుల మధ్య వివాదం చెలరేగింది. ఈ స్థితిలో, పరిమళం సముద్రంలో పడి మరణించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమేరకు కోస్ట్‌ గార్డ్‌ ఇన్‌న్‌స్పెక్టర్‌ పేచ్చిముత్తు నేతృత్వంలోని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం

తిరువొత్తియూరు: క్లోరిక్‌ యాసిడ్‌ తీసుకొస్తున్న లారీ ఢీకొని ఇద్దరు వాచ్‌మన్‌లు దుర్మరణం చెందారు. పుదుచ్చేరి నుంచి చైన్నెకి శనివారం ఉదయం క్లోరిక్‌ యాసిడ్‌ తీసుకొస్తున్న ట్యాంకర్‌ లారీ ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులో వెళుతోంది. ఉదయం 7.30 గంటలకు కల్పాకం సమీపం వయలూరు ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులో వెళుతుండగా హఠాత్తుగా లారీ వెనక చక్రం లారీ నుంచి విడిపోయింది. దీంతో అదుపుతప్పిన లారీ రోడ్డు పక్కన సైకిల్‌ పై వెళుతున్న వయలూరుకు చెందిన దురై (57), మదురైకి చెందిన కన్నన్‌ (60) ఢీకొంది. ఈ సంఘటనలో దురై, కన్నన్‌ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న రంగపట్టినం పోలీసులు ఆక్కడికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణలో మృతులు ప్రైవేట్‌ సంస్థలో వాచ్‌మన్లుగా పనిచేస్తున్నట్లు తెలిసింది.

హత్య కేసులో

ఐదుగురి అరెస్ట్‌

తిరువొత్తియూరు: మద్యం బాటిల్‌ గొడవలో రౌడీని హత్య చేసిన మహిళ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె, పెరియమేడు స్టింగర్స్‌ వీధికి చెందిన ప్రేమ్‌కుమార్‌ రౌడీ. శుక్రవారం రాత్రి ఇతనిపై ఐదుగురు కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడివున్న అతన్ని స్థానికులు చైన్నె రాజీవ్‌ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రేమ్‌కుమార్‌ మృతి చెందాడు. దీనికి సంబంధించి ప్రేమ్‌కుమార్‌ తల్లి అమ్ములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేపేరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రౌడీని హత్య చేసిన అదే ప్రాంతానికి చెందిన విజయనారాయణ, జీవ, దీనా, కన్నదాసన్‌, సుమతి, అనే ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 కత్తులు, కారు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

పాఠశాలకు

ఒకే ఒక్కడు

అన్నానగర్‌: నీలగిరి జిల్లాలోని కూడలూర్‌ సమీపం పాండియార్‌లో ఒక ప్రభుత్వ టీ ఎస్టేట్‌, ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. వారి పిల్లల విద్య కోసం పాండియార్‌లోని ప్రభుత్వ టీఎస్టేట్‌లోని గిడ్డంగి ప్రాంతంలో దండి నిర్వహణలో 1993లో ఒక ప్రాథమిక పాఠశాల ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గిరిజనులు, తోటల కార్మికుల పిల్లలు పెద్ద సంఖ్యలో ఇక్కడ చదువుకునేవారు. గత కొన్ని సంవత్సరాలుగా, విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గింది. ప్రస్తుతం ఆ పాఠశాలలో ఒక విద్యార్థి మాత్రమే 5వ తరగతి చదువుతున్నాడు. కూడలూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు అతనికి అదనపు పాఠాలు చెప్పడానికి వెళుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement