
జూలై 7న మహాకుంభాభిషేకం
తిరువొత్తియూరు: తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జూలై 7వ తేదీ ఉదయం 6.15 గంటల నుంచి 6.50 గంటల వరకు మహాకుంభాభిషేకం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఆరుపడైవీడుగల్(ఆరు ముఖ్య క్షేత్రాల)లో 2వ స్థానమైన తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జూలై 7న కుంభాభిషేక ఏర్పాట్లు జరుగుతున్నాయి దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ జ్ఞానశేఖర్ ఇచ్చిన ప్రకటనలో తిరుచెందూరు ఆలయంలో 12 ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేక ఉత్సవాలు జూలై 1 నుంచి 7వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. మహాకుంభాభిషేకం జూలై 7వ తేదీ ఉదయం నిర్వహిస్తామని పేర్కొన్నారు.