
ఘనంగా స్పైకాన్–2025
సాక్షి, చైన్నె : సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్, కార్నెగీ మెల్లన్ వర్సిటీ నేతృత్వంలో శనివారం స్థానికంగా స్పైకాన్ 2025 ఘనంగా జరిగింది. స్పిన్నింగ్ జెన్ ఏఐ థీమ్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగిన ప్రీమియర్ సమావేశంలో 30 సంవత్సరాల సేవల ఆవిష్కరణ గురించి నిర్వాహకులు వివరించారు. స్పిన్ చైన్నె జ్ఞాపకార్థం వాట్స్ హంప్రీ అవార్డులు అందజేశారు. స్పిన్ చైన్నె అధ్యక్షుడు డాక్టర్ రాజారామ్ వెంకటరామన్, కమిటీ చైర్మన్ రాజమాణిక్యం, ఐఐటీ మద్రాసులోని సెంటర్ ఫర్ రెస్సాన్సిబుల్ ఏఐ చీఫ్ డాక్టర్ శివరామకృష్ణన్, హైదరాబాద్లోని టి హబ్కు చెందిన డాక్టర్ శ్రీకాంత్ సుందరరాజన్, ప్రతినిధులు రమేష్ కృష్ణమూర్తి, అన్బళగన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్త డిజిటల్ యుగం, డీప్ టెక్ల గురించి ఈ సమావేశంలో చర్చించారు. అలాగే సలోని మల్హోత్రా, ఆస్తా అహ్లువాలియా రచించిన ప్లిప్ ది స్టోరీ గురించి వివరించారు. స్పైకాన్ 2025 ముఖ్యోద్దేశాన్ని వివరిస్తూ రూపొందించిన సావనీర్ను ఆవిష్కరించారు. అలాగే, ప్లిప్ది స్టోరీ పుస్తకాన్ని విడుదల చేశారు.