రచయితలను ప్రభుత్వం ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

రచయితలను ప్రభుత్వం ప్రోత్సహించాలి

Jun 8 2025 1:05 AM | Updated on Jun 8 2025 1:05 AM

రచయితలను ప్రభుత్వం ప్రోత్సహించాలి

రచయితలను ప్రభుత్వం ప్రోత్సహించాలి

వేలూరు: కొత్త పుస్తకాలు రచించే రచయితలను, కవులను ప్రభుత్వం ప్రొత్సహించాలని కవి లక్ష్మిపతి అన్నారు. వేలూరులోని ప్రయివేటు మండపంలో టీచర్‌ జోసఫ్‌ అన్నయ్య రచించిన శ్రీనేటి విద్యా విధానంలో మార్పుశ్రీ అనే అంశంపై రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించి కొనుగోలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి వ్యక్తి చేతిలో సెల్‌ఫోన్‌ ఉండడం వల్ల ఎవరూ పుస్తకాలు చదవడానికి ఆశక్తి చూపడం లేదన్నారు. మన రాష్ట్రంలోనే అనేక మంది కవులు, రచయితలు ఉన్నప్పటికీ వారి రాసే పుస్తకాలు, కవితలు బయట ప్రపంచానికి తెలియడం లేదన్నారు. తరచూ సెల్‌ఫోన్‌లో ఇమిడి ఉండడం వల్ల పుస్తకాలు చదివే వారి సంఖ్య పూర్గి తగ్గి పోయిందన్నారు. అదేవిధంగా గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదివే వారు కూడా కనుమరుగు అయ్యారన్నారు. దీంతోనే రచయితలకు తగిన గుర్తింపు రావడం లేదని చెప్పారు. రచయితలు, కవులను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోటరీ క్లబ్‌ గవర్నర్‌ పాండియన్‌, లైబ్రరియన్‌ రవి, రచయితలు పన్నీర్‌సెల్వం,జయపాల్‌, శ్రీధర్‌, రాజన్‌బాబు, తమిళనాడు ప్రాథమిక పాఠశాల టీచర్ల కూటమి ఆర్గనైజర్‌ మణిమేగలై పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement