క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jun 7 2025 1:01 AM | Updated on Jun 7 2025 1:01 AM

క్లుప

క్లుప్తంగా

విద్యార్థుల పాత్ర కీలకం

ఆవడి పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌

కొరుక్కుపేట: మత్తు పదార్థాల నిర్మూలనలో విద్యార్థుల ప్రాత కీలకమని ఆవడి పోలీస్‌ కమిషనర్‌ కే శంకర్‌ అన్నారు. చైన్నె పట్టాభిరామ్‌లోని డీఆర్‌బీసీసీసీ హిందూ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా చేరిన విద్యార్థులకు ఉన్నత విద్య గురించి అవగాహన కల్పించడానికి నిర్వహించే విద్యార్థి అవగాహన కార్యక్రమంలో శంకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పలు సూచనలు చేశారు. సోషల్‌ మీడియాలో మీ సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. కళాశాల సంచాలకులు డాక్టర్‌ ఎన్‌, రాజేంద్రనాయుడు అతిథిని ఘనంగా సత్కరించారు.

రైతులకు

సాంకేతిక తోడ్పాటు

సాక్షి, చైన్నె: రైతులకు ఉత్పాదకత, శ్రేయస్సు లక్ష్యంగా తర్వాత తరం సాంకేతికతను ముందుకు తీసుకొచ్చేందుకు మరింత శక్తివంతంగా ముందుకెళ్లనున్నామని ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామన్‌ మిట్టల్‌ తెలిపారు. 2026 ఆర్థిక సంవత్సర ప్రయాణంలో మే నెలలో 14,213 సోనాలిక ట్రాక్టర్ల అమ్మకాలతో తాము నమోదు చేసిన కొత్త మైలురాయి గురించి శుక్రవారం స్థానికంగా ఆయన ప్రకటించారు. రైతులకు అద్భుత ఫలితాలను అందించే విధంగా ఆవిష్కరణలు జరుగుతున్నాయని వివరించారు. రైతుల కోసం సోనాలికా జూన్‌ డబుల్‌ జాక్‌పాట్‌ ఆఫర్‌ను ప్రకటించామన్నారు.

కోవైలో అరుదైన శస్త్రచికిత్స

సాక్షి, చైన్నె: బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి నుంచి సేకరించిన మూత్ర పిండాలను 44 ఏళ్ల వ్యక్తికి అరుదైన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సను కోయంబత్తూరు వైద్యులు విజయవంతం చేశారు. కోయంబత్తూరులోని ఎఫ్‌ఐఎంఎస్‌ ఆస్పత్రి ఐఓఆర్‌టీఏ విభాగంలో జరిగిన ఈ శస్త్ర చికిత్స గురించి శుక్రవారం స్థానికంగా మీడియాకు డాక్టర్‌ ప్రభుకాంచి వివరించారు. వివేక్‌ అనే 44 ఏళ్ల రోగి మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతూ 2023 నుంచి డయాలసిస్‌ చేయించుకుంటూ వచ్చారని వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 25వ తేదీన మరింత సంక్లిష్ట పరిస్థితులు నెలకొనడంతో అవయవ మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమైనట్టు పేర్కొన్నారు. అవయవ మార్పిడి కోసం గత నెల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 43 ఏళ్ల వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలను యాక్సెస్‌ చేయడం, శస్త్ర చికిత్స చేయడం, పునరుజ్జీవం పోయడం అంశాలు చక చకా జరిగినట్టు వివరించారు. శస్త్ర చికిత్సతో రోగి కోలుకున్నట్టు తెలిపారు.

ప్రతిభావంతులకు

స్కాలర్‌ షిప్‌లు

సాక్షి, చైన్నె: ప్రతిభావంతులైన విద్యార్థులకు అబండెన్స్‌ విద్య కోసం స్కాలర్‌ షిప్‌లను పొందే అవకాశాన్ని ఎట్‌ సన్‌ రైస్‌ గ్లోబల్‌ చెఫ్‌ అకాడమీ కల్పించింది. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఎట్‌ సన్‌ రైస్‌ గ్లోబల్‌ చెఫ్‌ అకాడమీ సెలబ్రిటీ చెఫ్‌ రాజు కార్తికేయన్‌, ప్రాంతీయ మేనేజర్‌ వినయ్‌ జామి, డైరెక్టర్‌ ఆఫ్‌ రిక్రూట్‌మెంట్‌ సుమన్‌ సుబ్బయ్యన్‌, వ్యవస్థాపకురాలు ఎర్లిండే కాస్ట్రోటనేడో స్థానికంగా ప్రకటించారు. బ్రాండ్‌ విజిబిలిటీ, ఔట్రీచ్‌ను బలపేతంచేసే లక్ష్యంగా స్కాలర్‌ సిఫ్‌ టెస్ట్‌ను నిర్వహించనున్నామని వివరించారు. ప్రతిభావంతు లైన విద్యార్థులకు అబండైన్స్‌ విద్యకోసం ఈ సాల్కర్‌ షిప్‌లు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. జూలై 2025 ఇన్‌టేక్‌ కోసం స్కాలర్‌షిప్‌లు లభించనున్నాయని తెలిపారు.

నైల్లెలో ఇరువర్గాల ఘర్షణ

13 మందికి కత్తిపోట్లు

తిరువొత్తియూరు: నైల్లెలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. 13 మంది కత్తిపోట్లకు గురయ్యారు. నైల్లె టౌన్‌, పేట్టై చేరన్మహాదేవి రోడ్డులో రైల్వేగేట్‌ ప్రాంతంలో సుగాలీ కాలనీ ఉంది. ఇక్కడ వందకు పైగా సుగాలీలు నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో గురువారం రాత్రి అక్కడ నివసించే భాగ్యరాజ్‌ కుమారుడు ఆది (21) బైక్‌లో వేగంగా వెళ్లాడు. ఇది చూసిన అదే ప్రాంతానికి చెందిన మాయ (22) అతన్ని ఆపి మందలించాడు. ఆసమయంలో అక్కడ ఉన్న వారు ఇరువర్గాలగా ఏర్పడి ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు కొడవళ్లు, కట్టెలు వంటి ఆయుధాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో 13 మంది గాయపడ్డారు. గాయపడ్డ అందరినీ నైల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

క్లుప్తంగా1
1/2

క్లుప్తంగా

క్లుప్తంగా2
2/2

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement