
లక్ష్మీ మూవీ మేకర్స్ చిత్రం ప్రారంభం
తమిళసినిమా: ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ తాజాగా తన 27వ చిత్రాన్ని పూజాకార్యక్రమాలతో ప్రారంభించింది. హాస్య నటుడు పుగళ్ కథానాయకుడిగా, రవిమరియ ప్రతినాయకుడిగానూ నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజ్ఞానయన్ నాయకిగా పరిచయం అవుతున్నారు. విన్సెంట్ అశోకన్, కుంకీ అశ్విన్, దిడియన్ ఇందిరన్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను సజో సుందర్ నిర్వహిస్తున్నారు. ఎం.శ్రీవత్సన్, ఎం.గోకుల్కృష్ణన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీకే.మురుగేశన్, తిరుపూర్ జియో.ఏ, ఎన్.సెల్వరాజ్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యూకే.సెంథిల్కుమార్ చాయాగ్రహణం, సుభాష్ మునిరత్నం సంగీతాన్ని అందిస్తున్నారు. శుక్రవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ముహూర్తం షాట్కు నిర్మాత, నటుడు చిత్రాలక్ష్మణన్ క్లాప్ కొట్టగా, నిర్మాత హెచ్.మురళి, చాయాగ్రాహకుడు శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇది వినోదంతో కూడిన థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర షూటింగ్ నేటి నుంచి జరుగుతుందని ఆయన తెలిపారు.