
తిరుత్తణి ఆలయంలో పెళ్లి సందడి
తిరుత్తణి: శుభ ముహూర్త దినం సందర్భంగా తిరుత్తణి కొండ ఆలయంలో శుక్రవారం సందడి నెలకొంది. వైశాఖ మాసంలో శుభ ముహూర్త దినం సందర్భంగా శుక్రవారం తిరుత్తణి కొండ ఆలయంలో 72 జంటలకు వివాహాలు నిర్వహించారు. ఇందుకోసం వధూవరుల బంధువులు, కుటుంబీకులు గురువారం రాత్రి తిరుత్తణి కొండ ఆలయం చేరుకున్నారు. శుక్రవారం వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు కొండ ఆలయంలో కల్యాణ మండపాలు, ఆలయ ఆర్సీ మండపంలో వరుస క్రమంలో వివాహాలు జరిగాయి.
దీంతో మంగళ వాయి ద్యాలు, వధూవరుల సందడి నెలకొంది. వివాహం పూర్తి చేసుకున్న చేతులతో వధూవరులు నేరుగా స్వామి దర్శనానికి వెళ్లారు. అలాగే వారి బంధువులు, వివాహానికి హాజరైన వారు స్వామి దర్శనం కోసం క్యూలైన్లో రెండు గంటలపాటు వేచివుండి దర్శనం పొందారు,. వివాహాల సందర్భంగా కొండ ఆలయం కిటకిటలాడింది. వాహనాలు పోటెత్తడంతో కొండ ఆలయ ఘాట్రోడ్డులో ట్రాఫిక్ సమ స్య తలెత్తింది. పోలీసులు పరిస్థితి చక్కదిద్దారు.