
చికెన్రైస్ తిని బాలుడి మృతి
తిరువళ్లూరు: చికెన్రైస్ తిని ఓ బాలుడు మృతిచెందిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యం ప్రాంతానికి చెందిన సురేందర్ విద్యుత్శాఖలో అధికారి. ఇతని కుమారుడు భరత్(13) స్థానికంగా వున్న ప్రయివేటు పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో భరత్ తండ్రి సమీపంలోని ఫాస్ట్పుడ్ సెంటర్కు వెళ్లి చికెన్రైస్, చికెన్గ్రేవీ తీసుకొచ్చాడు. భరత్ చికెన్రైస్, చికెన్ తినడంతో బుధవారం రాత్రి హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే భరత్ను సమీంపలోని ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చిక్సిత అనంతరం పెద్దపాళ్యం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ బాలుడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. విషయం తెలిసి పెద్దపాళ్యం పోలీసులు మృతదేహాన్ని శవపరిక్ష నిమిత్తం తిరువళ్లూరు జిల్లా వైద్యకేంద్రానికి తరలించారు. చికెన్రైస్, చికెన్ తినడం వల్లే మృతిచెందాడని తల్లిదండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.